NTV Telugu Site icon

Seethapalli Vagu: విహారయాత్రలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

Vagu

Vagu

Seethapalli Vagu: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామం సీతపల్లి వాగులో జరిగింది.. ఈ ఘటనతో గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో రంపచోడవరం విహారయాత్రకు వెళ్లారు. సీతపల్లి వాగులో  సరదాగా దిగి స్నానం చేస్తుండగా వారిలో ముగ్గురు వాగు లోతుల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. మిగిలిన ఇద్దరూ బయట పడ్డారు. పదహారేళ్ల వీర వెంకట అర్జున్ , అండిబోయిన దేవి చరణ్ , లావేటి రామన్ లు గల్లంతు అయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న రంపచోడవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు వెలికితీశారు.. అనంతరం పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. దీనితో రంప ఎర్రంపాలెంలో విషాదం అలముకుంది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. చిన్నారులు మృతిచెందడంతో.. వారి కుటుంబ సభ్యులను అదుపుచేయడం ఎవ్వరివల్లా కావడం లేదు.

Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ