Ganjai Destroyed: విజయవాడలో మూడుకోట్ల విలువైన గంజాయి దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతోంది. వివిధ కేసులలో పట్టుబడిన సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన అక్రమ గంజాయిని దహనం చేశారు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు. గురువారం ఉదయం కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిటాల గ్రామం, దొనబండ క్వారీ రోడ్ నందు గంజాయిని దగ్ధం చేశారు. ఎన్. టి. ఆర్.జిల్లాలోని కంచికచెర్ల, వన్ టౌన్, సత్యనారాయణపురం, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహీంపట్నం , గుణదల మరియు పటమట పరిధిలోని పోలీస్ స్టేషన్లలో గత కొంత కాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువగలిగిన 7459 కేజీ ల గంజాయిని దహనం చేశామని పోలీసులు తెలిపారు.
ఈ సందర్బంగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా వివరాలు అందచేశారు. గంజాయి సాగు,అక్రమ రవాణాను అరికట్టే దిశగా అపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టిన సంగతి అందరికీ విదితమే. రాష్ట్ర డి.జి.పి. KV రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలతో దాడులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:Mudragada Padmanabham: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువగలిగిన 7459 కేజీ ల గంజాయిని దహనం చేయడం జరిగింది. నగరంలోని పైన తెలిపిన 24 పోలీస్ స్టేషన్ లలో ఇప్పటివరకు 702 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ గంజాయిని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశానుసారం డ్రగ్ డిస్పోసల్ కమిటీ వారి ఉత్తర్వుల మేరకు దహనం చేయడం జరిగినది. ఈ ఆదేశానుసారం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ, ఎక్కడిక్కడ అక్రమ గంజాయి రవాణాను అరికడుతూ, కేసులు నమోదు చేస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని కొంతమంది ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వారు చట్టపరంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.
Read Also: Mudragada Padmanabham: సీఎం జగన్ కు మరో లేఖ రాసిన ముద్రగడ
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!