AP News : ఇద్దరు పిల్లల తల్లి(40)ని ప్రేమ వివాహం చేసుకున్న 25 ఏళ్ల యువకుడు.. చివరికీ..
- మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
- పురుగులు మందు తాగి యువకుడూ మృతి
- అసలు ఏం జరిగిందటే??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసులో ఉన్న యువతి, యువకుడు పెళ్లి చేసుకుని సంసారం చెయ్యడం సర్వసాధారణం. వివాహం చేసుకున్న తరువాత దంపతుల మధ్య గొడవలు రావడం, విడిపోవడం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భలే గమ్మత్తు అయిన విషయం వెలుగు చూసింది. 40 ఏళ్ల ఆంటీని ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థక కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
READ MORE: Vishnupriya : చీరకట్టులో నడుము అందాలు చూపిస్తున్న విష్ణుప్రియ
Also Read
అసలు విషయం ఏంటంటే?
విశాఖపట్నానికి చెందిన పద్మ(40) ఓ యువకుడి ప్రేమలో పడింది. ఆమెకు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే కొడుకు, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కూతురు ఉన్నారు. కానీ సోషల్ మీడియా పద్మను ముంచేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఏడాది కిందట శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీకి పాతికేళ్ల సురేష్ పరిచయమయ్యాడు.. సురేష్ ఓ మొబైల్ దుకాణంలో పని చేసేవాడు. ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ సురేష్ లెక్కచేయలేదు. ఆమెకు కూడా అంతే.. కుటుంబాన్ని వదిలేసిన పద్మ గతంలో యువకుడి కోసం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది. పోలీసుల ఫిర్యాదు చేసిన భర్త ఎలాగోలా ఇంటికి రప్పించాడు. కానీ సురేష్తోనే కలిసి జీవించాలని ఆమె నిర్ణయించుకుంది.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్!
గతేడాది నవంబర్లో ఉత్తరం రాసి మళ్లీ ప్రియుడి చెంతకు చేరింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమలాడినా ఫలితం లేకుండా పోయింది. పద్మ, సురేష్ పెళ్లి చేసుకున్నారు. యువకుడి కుటుంబీకులు అంగీకరించలేదు. కైలాసగిరి కాలనీలో పద్మతో సురేష్ కాపురం పెట్టారు. కొన్ని రోజులు బాగానే గడిచింది. మేన 22న పద్మ అకస్మాత్తుగా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా సురేష్ సురేష్ ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. మరునాడు తాను కూడా పురుగుల మందు తాగాడు.
READ MORE: Covid cases: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు.. పెరుగుతున్న కేసులు..
సురేష్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాళాలు పగులగొట్టిన పోలీసులకు పద్మ మృతదేహం.. కొన ఊపిరితో ఉన్న సురేష్ ను చూసి షాక్ అయ్యారు. సురేష్ను ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి సురేష్ చికిత్స పొందుతూ కన్నుముశాడు. టిఫిన్, భోజనాన్ని వృథా చేయడంతో సురేష్ మందలించాడని.. గొడవ పెరిగి పెద్దదై పద్మ బలవన్మరణానికి పాల్పడేంత వరకు వచ్చిందని చెబుతున్నారు. చేతికొచ్చిన కొడుకు దూరం కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ వయసులో తప్పటడుగు వేసిన తల్లి మృత్యువు ఒడికి చేసుకోవడంతో పద్మ కుమారుడు, కుమార్తె కన్నీరు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!