జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. దేగ్వార్ సెక్టార్లోని ఎల్ఓసీ సమీపంలో ఉగ్రవాదుల అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. ఆ తర్వాత భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాల బృందంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రమూకలపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు.
Also Read:UK Warns: గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్పై మండిపడ్డ నెతన్యాహు
దేగ్వార్ సెక్టార్లోని ఎల్ఓసీ సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారం అందిందని భద్రతా దళాలు తెలిపాయి. దీని ఆధారంగా, సైన్యం వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిపిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. హతమైన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి చొరబడటానికి ప్రయత్నించారని తెలిపారు. ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.