NTV Telugu Site icon

Jharkhand: మంత్రి మరణించిన 2 నెలల తర్వాత మంత్రిగా భార్య ప్రమాణ స్వీకారం

Jharkhand

Jharkhand

Jharkhand: జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా జార్ఖండ్ మాజీ మంత్రి జాగర్నాథ్ మహ్తో భార్య బేబీ దేవి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు.

Also Read: Liquor Policy Case: మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరణ

పాఠశాల విద్య, అక్షరాస్యత, ఎక్సైజ్‌కు బాధ్యత వహించిన జాగర్‌నాథ్ మహ్తో మరణంతో హేమంత్ సోరెన్ క్యాబినెట్‌లో మంత్రి పదవి ఖాళీ అయింది. గిరిదిహ్ జిల్లాలోని డుమ్రి నుండి నాలుగుసార్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన జగర్నాథ్ మహ్తో, కొవిడ్ -19 సమస్యల కారణంగా సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 6న చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బేబీ దేవి ప్రస్తుత యూపీఏ ప్రభుత్వంలో అసెంబ్లీకి ఎన్నిక కాకముందే మంత్రి అయిన రెండవ జేఎంఎం నేత కావడం గమనార్హం. అంతకుముందు, హఫీజుల్ అన్సారీ ఫిబ్రవరి 6, 2021న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన మే 2, 2021న మధుపూర్ ఉప ఎన్నికలో గెలిచారు.