Cyber Crime: ఒక ఫ్లాట్, ఇద్దరు యువకులు, 84 బ్యాంకు ఖాతాలు, రూ.854 కోట్ల మోసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు చేసిన ఈ సైబర్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మనోజ్ శ్రీనివాస్, ఫణీంద్ర అనే ఇద్దరు యువకులు పేరు లేకుండా ఓ కంపెనీని ప్రారంభించారు. కంపెనీలో పని చేసేందుకు ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకున్నారు. వారికి 8 మొబైల్ ఫోన్లతో పగలు రాత్రి పనిని అప్పగించారు. సెప్టెంబరులో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు మనోజ్, ఫణీంద్ర సహా 6 మందిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి రూ.8.5 లక్షల మోసంపై 26 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని తనను ట్రాప్ లోకి లాగి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Argentina: అబ్బాయిల వల్లే కాదు.. అమ్మాయిలు ఇన్ని పరుగులేంట్రా బాబు.. రికార్డు బద్దలు
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ప్రజలను మోసం చేస్తున్నారు. ఓ యువతి ఫిర్యాదు చేయడంతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులు వీరి నెట్ వర్క్ ను విచారించగా గత రెండేళ్లలో 84 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.854 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సెప్టెంబర్లో పోలీసులు ట్రేస్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇద్దరు నిందితులు వేలాది మందిని బాధితులుగా మార్చారు. వారి బ్యాంకులను స్తంభింపజేసిన సమయంలో వారి ఖాతాలో రూ.5కోట్లు మాత్రమే ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రూ.854 కోట్లు గేమింగ్ యాప్లు, యూఎస్డీటీ వంటి క్రిప్టోకరెన్సీలు, ఆన్లైన్ క్యాసినోలు వంటి వివిధ ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులైన మనోజ్, బ్యాంక్ అకౌంటెంట్ వసంత్ కుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని నిందితులు చెబుతున్నారు,
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!