Cyber Crime: ఒక ఫ్లాట్, ఇద్దరు యువకులు, 84 బ్యాంకు ఖాతాలు, రూ.854 కోట్ల మోసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు చేసిన ఈ సైబర్ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. మనోజ్ శ్రీనివాస్, ఫణీంద్ర అనే ఇద్దరు యువకులు పేరు లేకుండా ఓ కంపెనీని ప్రారంభించారు. కంపెనీలో పని చేసేందుకు ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకున్నారు. వారికి 8 మొబైల్ ఫోన్లతో పగలు రాత్రి పనిని అప్పగించారు. సెప్టెంబరులో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు మనోజ్, ఫణీంద్ర సహా 6 మందిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి రూ.8.5 లక్షల మోసంపై 26 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని తనను ట్రాప్ లోకి లాగి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Argentina: అబ్బాయిల వల్లే కాదు.. అమ్మాయిలు ఇన్ని పరుగులేంట్రా బాబు.. రికార్డు బద్దలు
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ప్రజలను మోసం చేస్తున్నారు. ఓ యువతి ఫిర్యాదు చేయడంతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులు వీరి నెట్ వర్క్ ను విచారించగా గత రెండేళ్లలో 84 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.854 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సెప్టెంబర్లో పోలీసులు ట్రేస్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇద్దరు నిందితులు వేలాది మందిని బాధితులుగా మార్చారు. వారి బ్యాంకులను స్తంభింపజేసిన సమయంలో వారి ఖాతాలో రూ.5కోట్లు మాత్రమే ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. రూ.854 కోట్లు గేమింగ్ యాప్లు, యూఎస్డీటీ వంటి క్రిప్టోకరెన్సీలు, ఆన్లైన్ క్యాసినోలు వంటి వివిధ ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులైన మనోజ్, బ్యాంక్ అకౌంటెంట్ వసంత్ కుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తమను తప్పుడు కేసులో ఇరికించారని నిందితులు చెబుతున్నారు,
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!