Site icon NTV Telugu

Hyderabad: రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండిని తరలిస్తున్న ఇద్దరు అరెస్టు..

Gold

Gold

లెక్కల్లో చూపని రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కమిషనర్‌ టాస్క్‌ ఫోర్స్‌ నార్త్‌ జోన్‌ బృందం పట్టుకుంది. జూన్ 14న, ఇద్దరు నిందితులు, బజ్జూరి పూర్ణచందర్ (49), సయ్యద్ బాబా షరీఫ్ (25) ఇద్దరూ వరుసగా మెట్టుగూడ మరియు వరంగల్ నివాసితులు చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించడంలో విఫలమైనప్పుడు సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలోని అపర్ణ ఉస్మాన్ ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ సమీపంలో అరెస్టు చేశారు.

Bangalore: బెంగళూరు-తిరుపతి హైవేపై ప్రమాదం.. ముగ్గురు యువకుల మృతి

ఆభరణాలతో పాటు హోండా కారు, మూడు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి నుంచి 2 కోట్ల విలువైన 2.5 కిలోల బంగారం., కిలో వెండి అభ‌ర‌ణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను నిందితులను పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, వెండిని ఐటి శాఖ అధికారుల‌కు అప్ప‌గించారు పోలీసులు.

Delhi water crisis: నీటిని విడుదల చేయాలని హర్యానా సర్కార్‌కు ఆప్ విజ్ఞప్తి

Exit mobile version