19 IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.. తాజాగా, మరో 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
ఏపీ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం..
* భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా జయలక్ష్మీ
* అటవీశాఖ స్పెషల్ సీఎస్గా అనంతరాము
* రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతీలాల్
* ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ సీఎస్గా రామ్ ప్రకాష్ సిసోడియా
* పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
* ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్కి అదనపు బాధ్యతలు అప్పగింత
* పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
* మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
* సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
* క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్
* మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
* పరిశ్రమలు శాఖ డైరెక్టర్గా సి. శ్రీధర్
* ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
* పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా వి.విజయరామరాజు
* సమాచారశాఖ డైరెక్టర్గా హిమాన్షు శుక్లా
* వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఎస్.ఢిల్లీ రావు ను బదిలీ చేశారు. ఇక, పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శి సురేష్ కుమార్కు గ్రామ వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబుకి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. మరింత సమాచారం కోసం కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..