NTV Telugu Site icon

Boat Accident: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. పడవ మునిగి 15 మంది మృతి

Indonaisa

Indonaisa

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. గల్లంతైన ప్రయాణికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామనీ.. గాయ‌ప‌డిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

Jailer vs Jailer: రజనీకాంత్ జైలర్‌కి పోటీగా మరో జైలర్.. ఇదెక్కడి ట్విస్ట్ మావా?

ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధాని కెండారికి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలోని మునా ద్వీపంలోని అఖాతం గుండా పడవ వెళ్లినట్లు గుర్తించారు. 17,000 కంటే ఎక్కువ ద్వీపాల ద్వీపసమూహమైన ఇండోనేషియాలో ఫెర్రీలు ఒక సాధారణ రవాణా మార్గంగా ఉన్నాయి. ఇక్కడ పడవ ప్రమాదాలు సాధారణం, ఎందుకంటే భద్రతా ప్రమాణాలు బలహీనంగా ఉండటం.. ప్రాణాలను కాపాడే పరికరాలు లేకుండా నౌకలను ఓవర్లోడ్ చేయడానికి అనుమతిస్తాయి. దీంతో త‌ర‌చు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు.. 2018లో సుమత్రా ద్వీపంలోని ప్రపంచంలోని లోతైన సరస్సులలో ఒక ఫెర్రీ మునిగిపోవడంతో 150 మందికి పైగా మృతిచెందారు. గత సంవత్సరం మేలో, 800 మందికి పైగా ప్రజలను తీసుకువెళుతున్న ఫెర్రీ తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని నీటిలో మునిగిపోయింది. అయితే లోతు త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్రాణ‌న‌ష్టం ఏమీ జరగలేదు.