Mass Shooting: చార్లెస్ యూనివర్సిటీలో కాల్పులు.. 15 మంది మృతి

Charless Univaersity

Charless Univaersity

చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జన్‌ పలాచ్‌ స్క్వేర్‌లోని చార్లెస్‌ యూనివర్సిటీలో చొరబడిన ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ భవనంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో 15 మంది అక్కడిక్కడే మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుపెట్టారు. ఇక, ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Read Also: Prabhas: నైజాం కింగ్ అని నిరూపిస్తున్నాడు… ఆర్ ఆర్ ఆర్ సేల్స్ కూడా దాటేశాడు

×
×
Ad

అయితే, యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే వర్సిటీకి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కాగా, కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం లేదని చెక్‌ రిపబ్లిక్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ విట్‌ రాకుసన్‌ వెల్లడించారు. పోలీసుల విచాణరకు సహకరించాలని స్థానికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.