Site icon NTV Telugu

IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..

Telangana

Telangana

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్‌ కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యద‌ర్శిగా శ్రీధ‌ర్.. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్‌గా శ్రీధ‌ర్‌కే అద‌న‌పు బాధ్యత‌లు అప్పగించారు. మ‌హిళ‌, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యద‌ర్శిగా అనితా రామ‌చంద్రన్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఇలంబ‌రితి, ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌గా కే.సురేంద్ర మోహ‌న్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హ‌రికిర‌ణ్‌, ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యద‌ర్శిగా అద‌న‌పు బాధ్యత‌ల్లో కూడా కృష్ణ భాస్కర్ కొన‌సాగ‌నున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివ‌శంక‌ర్, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజ‌న, లేబర్‌ కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌, జీఏడీ కార్యదర్శిగా గౌరవ్‌ ఉప్పల్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి నియామ‌కం అయ్యారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పలువురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Exit mobile version