Israel Raids: ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది పాలస్తీనియన్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Raids: పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. జెనిన్లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఈ దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోరమైన ఈ ఘటనపై పాలస్తీనాలో తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వెస్ట్ బ్యాంక్ నగరంలో జరిగిన ఈ దాడిలో ఈ ఏడాది ఇజ్రాయెల్ దళాలచే చంపబడిన పాలస్తీనియన్ల మొత్తం సంఖ్య 30కి చేరుకుంది. దీనిని ఉగ్ర నిరోధక చర్యగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. ఇజ్రాయెల్తో భద్రతా సంబంధాలను తగ్గించుకోవాలని పాలస్తీనా నాయకులపై ఒత్తిడి పెరుగుతోంది. మరో ఘటనలో 22 ఏళ్ల పాలస్తీనియుడిపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపగా.. అతడు ప్రాణాలు కోల్పోయాడు.
పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ (PRC) ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు మొదట వైద్య సిబ్బందిని జెనిన్ శిబిరానికి వెళ్లడం అసాధ్యం చేశాయి, అక్కడ గాయపడిన నలుగురు వ్యక్తులు తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. జెనిన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ డబ్బాలను కూడా కాల్చాయని, దీని ఫలితంగా పిల్లలు దానిని పీల్చడం వల్ల అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. అయితే, దాడిలో అమాయక పాలస్తీనియన్లు చంపబడ్డారనే వాదనలను ఇజ్రాయెల్ దళం ఖండించింది. దళాలు ఇస్లామిక్ జిహాద్ టెర్రర్ ఆర్గనైజేషన్కు చెందిన టెర్రర్ స్క్వాడ్ను పట్టుకోవడానికి గురువారం జెనిన్లో పనిచేస్తున్నారని, ఆ దళాలు పలువురు ఉగ్రవాదులను చంపినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పాలస్తీనా అథారిటీ ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టయేహ్ స్పందించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించేందుకు అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి
ఇజ్రాయెల్ సైనికులు, పౌరులపై దాడులకు పాల్పడిన ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్లో తీవ్రవాద దాడిని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే వారి హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. ఇజ్రాయెల్ దళాలకు సంబంధించి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సైన్యం తెలిపింది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!