Tamilnadu: కోయంబత్తూరులో రీపోలింగ్కు అన్నామలై డిమాండ్.. కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. అయితే తమిళనాడులో కొత్త సమస్య వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోలింగ్ తీరును తప్పుపట్టారు. కోయంబత్తూరులో లక్ష మంది ఓటర్ల పేర్లు కనిపించకుండా పోయాయని.. తక్షణమే కోయంబత్తూరులో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాల్లో సాయంత్రం 7 గంటలకు వకు పోలింగ్ జరిగింది. మొత్తం 62.23 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Etela Rajendar: ఈటలను ఓడించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అయితే కోయంబత్తూరులో ఓటర్ల జాబితాలో దాదాపు లక్ష మంది ఓటర్ల పేర్లు లేకపోవడంపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమైన ఓటరు పేర్లు లేని బూత్లలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ సంసిద్ధతను ఆయన ప్రశ్నించారు. దాదాపు 20-25 ఓట్లు స్పష్టమైన కారణం లేకుండా తొలగించబడ్డాయని ఆయన ఆరోపించారు. ఒక ప్రత్యేక బూత్లోనే ఏకంగా 830 మంది పేర్లు లేవని తెలిపారు. భారీ ఎత్తున ప్రణాళికాబద్ధంగా తొలగింపు జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయినా ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎన్నికలకు ముందస్తు సన్నద్ధత అంతా ఏమైంది? మలేషియా, మస్కట్ వంటి విదేశాల నుంచి చాలా మంది వచ్చారని.. పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు లేని పోలింగ్ బూత్లలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు అన్నామలై మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Ramdev Baba: రామ్దేవ్కు సుప్రీంకోర్టు మరో షాక్.. పన్ను చెల్లించాల్సిందేనంటూ హుకుం
ఏడు దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే 39 స్థానాలకు గానూ 38 స్థానాలను కైవసం చేసుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Nindha: ‘నింద’ పడిందంటున్న వరుణ్ సందేశ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!