Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- రేణుకాస్వామి తరహాలో యువకుడిపై దాడి
- నటుడు దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్కు అభిమాని అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
Also Read
తాజాగా అదే తరహాలో బెంగళూరులో మరో ఘటన జరిగింది. మాజీ ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పది మందితో కూడిన ముఠా.. యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేశారు. దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా నిందితుల్లో ఒకరు పేర్కొనడం విశేషం.
ఇది కూడా చదవండి: Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు.. ఆటో మార్కెట్లో సంచలనం
కుశాల్ అనే యువకుడు రెండేళ్ల నుంచి ఒక కాలేజీ విద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థలు వచ్చి కొన్ని నెలల నుంచి విడిపోయారు. అనంతరం అమ్మాయి మరొక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ వ్యవహారం కుశాల్కు ఆగ్రహాన్ని తెప్పించింది. తనను మోసం చేసిందన్న కోపంతో మాజీ ప్రియురాలికి కుశాల్ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆమె.. తాజా ప్రియుడికి తెలియజేసింది. ఇక అంతే 10 మంది స్నేహితులతో కుశాల్ను కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఇష్టానురీతిగా దాడి చేశారు. కుశాల్ బట్టలు విప్పి ప్రైవేటు భాగాలపై కిరాతకంగా దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిందితుడు మాట్లాడుతూ… దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా చెబుతున్న మాటలు వినిపించాయి. ఆ కేసును ప్రస్తావిస్తూ నవ్వుతూ కనిపించాడు.
దాడి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాట్లాడుకుందామని పిలిచి.. కారులో తీసుకొచ్చి దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడన్న కారణంతో అభిమాని రేణుకాస్వామిని జూన్ 8, 2024న కిడ్నాప్ చేసి నటుడు దర్శన్ చంపేశాడు. ఈ కేసులో ప్రియురాలు పవిత్ర, నటుడు దర్శన్ను జూన్ 11న అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. ఆర్ధిక వివాదం అంటూ మరో నలుగులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కుట్రలో మొత్తం 15 మంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!