Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- రేణుకాస్వామి తరహాలో యువకుడిపై దాడి
- నటుడు దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్కు అభిమాని అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi: సూర్య కారణంగా.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
తాజాగా అదే తరహాలో బెంగళూరులో మరో ఘటన జరిగింది. మాజీ ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పది మందితో కూడిన ముఠా.. యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేశారు. దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా నిందితుల్లో ఒకరు పేర్కొనడం విశేషం.
ఇది కూడా చదవండి: Xiaomi YU7 SUV: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్లు.. ఆటో మార్కెట్లో సంచలనం
కుశాల్ అనే యువకుడు రెండేళ్ల నుంచి ఒక కాలేజీ విద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థలు వచ్చి కొన్ని నెలల నుంచి విడిపోయారు. అనంతరం అమ్మాయి మరొక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ వ్యవహారం కుశాల్కు ఆగ్రహాన్ని తెప్పించింది. తనను మోసం చేసిందన్న కోపంతో మాజీ ప్రియురాలికి కుశాల్ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆమె.. తాజా ప్రియుడికి తెలియజేసింది. ఇక అంతే 10 మంది స్నేహితులతో కుశాల్ను కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఇష్టానురీతిగా దాడి చేశారు. కుశాల్ బట్టలు విప్పి ప్రైవేటు భాగాలపై కిరాతకంగా దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిందితుడు మాట్లాడుతూ… దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా చెబుతున్న మాటలు వినిపించాయి. ఆ కేసును ప్రస్తావిస్తూ నవ్వుతూ కనిపించాడు.
దాడి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాట్లాడుకుందామని పిలిచి.. కారులో తీసుకొచ్చి దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడన్న కారణంతో అభిమాని రేణుకాస్వామిని జూన్ 8, 2024న కిడ్నాప్ చేసి నటుడు దర్శన్ చంపేశాడు. ఈ కేసులో ప్రియురాలు పవిత్ర, నటుడు దర్శన్ను జూన్ 11న అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. ఆర్ధిక వివాదం అంటూ మరో నలుగులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కుట్రలో మొత్తం 15 మంది పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!