Wolf Attack: యూపీలో నరమాంస భక్షక తోడేళ్లు.. 13 ఏళ్ల బాలుడిపై దాడి..
- యూపీని భయపెడుతున్న తోడేళ్ల దాడులు..
- తాజాగా 13 ఏళ్ల బాలుడిపై దాడి..
- బహ్రైచ్ జిల్లాలోని 50 గ్రామాలపై దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attack: ఉత్తర్ ప్రదేశ్లో తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ తోడేళ్ల దాడుల వల్ల బహ్రైచ్ జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు. నరమాసానికి మరిగిన తోడేళ్లను పట్టుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి, 200 మందికి పైగా అటవీ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ, ఈ దాడులను అడ్డుకట్ట పడటం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా 13 ఏళ్ల బాలుడిపై తోడేళ్ల దాడి జరిగింది. మహసీ ప్రాంతంలోని పిప్రి మోహన్ గ్రామంలో ఆదివారం రాత్రి అర్మాన్ అలీ అనే బాలుడిపై దాడి జరిగింది. దాడి సమయంలో బాలుడి మెడకు గాయమైంది మరియు వెంటనే ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి తదుపరి సంరక్షణ కోసం బహ్రైచ్లోని మెడికల్ కాలేజీకి తరలించారు. ఇంటి టెర్రస్పై బాలుడు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
Read Also: TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!
Also Read
ఇదిలా ఉంటే, ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ మహసీ తాహసీల్లోని సిసయ్య చురామణి గ్రామాన్ని సందర్శించారు. తోడేళ్ల దాడులకు గురైన బాధితులతో సమావేశమై, పరామర్శించారు. ఆరు తోడేళ్ల గుంపు ఉత్తరప్రదేశ్లోని 50 గ్రామాలను భయభ్రాంతులకు గురి చేయడంతో తోడేళ్ల సంక్షోభం ప్రారంభమైంది. అటవీ శాఖ ఐదు తోడేళ్లను పట్టుకోగా, ఒకటి ఇప్పటి వరకు చిక్కలేదు. ఇవి ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను, ఒక మహిళ ప్రాణాలను తీశాయి. మరో 51 మంది గాయపడ్డారు. జూలై నుంచి బహ్రైచ్లో వరసగా దాడులు జరిగుతున్నాయి. దీంతో తోడేళ్లను పట్టుకునేందుకు ‘‘ఆపరేషన్ భేదియా’’ని ప్రారంభించారు. 165 మందికి పైగా అటవీ సిబ్బంది మరియు 18 మంది షూటర్లను ఆ ప్రాంతంలో మోహరించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!