Site icon NTV Telugu

Nithyananda: నిత్యానందకు రామ మందిర ఆహ్వానం..హాజరవుతానని ప్రకటన..

Nithyananda

Nithyananda

Nithyananda: అయోధ్య రామ మందిర వేడుకకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందని వివాదాస్పద గురువు నిత్యానంద వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. తనను తాను స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానంద, పరారీలో ఉన్న అత్యాచార నిందితుడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. తనకు తాను కౌలాస దేశాన్ని సృష్టించుకుని, హిందూ మతానికి సుప్రీంగా చెప్పుకుంటున్నాడు.

Read Also: Ayodhya security: 13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..

‘‘ఈ చారిత్రాత్మక, అసాధారణమైన సంఘటనను మిస్ చేయవద్దు. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు అధికారికంగా ఆలయ ప్రధాన దేవుడిగా ఆవాహన చేయబడుతాడు. ప్రపంచం మొత్తంపై దయ చూపేందుకు వస్తున్నాడు’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో నిత్యానంద కామెంట్ చేశాడు. ఈ గొప్ప కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానించారని, భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం హాజరవుతారని చెప్పారు.

నిత్యానంద డ్రైవర్ ఫిర్యాదుతో 2010లో అతనిపై అత్యాచార కేసు నమోదైంది, ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన ఇతను 2020లో ఇండియా నుంచి పారిపోయాడు. ఈక్వెడార్ దేశ సమీపంలో ఒక ద్వీపంలో “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస” పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు.

Exit mobile version