UP: “హనీమూన్”కి ముందే లవర్తో లేచిపోయిన భార్య.. బతికానంటూ భర్త ఆనందం..
- హనీమూన్కి ముందే లవర్తో పారిపోయిన భార్య..
- ‘‘రఘువంశీలా కాలేదు’’ అని భర్త ఆనందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: రాజా రఘువంశీ, సోనమ్ వ్యవహారం దేశాన్ని కలవరానికి గురిచేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న యువకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ ఘటన చేసింది. హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, అక్కడే అతడిని దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఉండేందుకు, కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. రాజాను చంపేందుకు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ బదౌన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య లవర్ తో కలిసి పారిపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే అతడి భార్య, ప్రియుడితో కలిసి లేచిపోయింది. భర్త ఆమెను వెతకడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా.. ‘‘నేను మరొక రాజా రఘువంశీగా మారకుండా తప్పించుకున్నాను’’ అని సంతోషపడుతున్నారు. తన ప్రియుడితో కలిసి జీవించాలనే భార్య నిర్ణయాన్ని అంగీకరించారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..
ఖుష్బూకు మే 17న సునీల్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అత్తామామల ఇంటికి వెళ్లింది. 9 రోజుల తర్వాత వివాహ సంప్రదాయాల్లో భాగంగా పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత, తన ప్రియుడితో అక్కడి నుంచి పారిపోయింది. సునీల్ తన భార్య కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నప్పుడు, ఖుష్బూ సోమవారం పోలీస్ స్టేషన్లో కనిపించి తన ప్రేమికుడితో పారిపోయినట్లు ఒప్పుకుంది. సునీల్ తన భార్య నిర్ణయాన్ని అంగీకరించాడు.
‘‘ఆమెను మా హనీమూన్ కోసం నైనిటాల్కు తీసుకెళ్లాలని నేను ప్లాన్ చేసాను. కానీ ఆమె తన ప్రేమికుడితో ఉండాలనుకుంటే, నేను కూడా సంతోషంగా ఉన్నాను. మరో రాజా రఘువంశీగా మారకుండా నేను తప్పించుకున్నాను! ఇప్పుడు మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాము. నా జీవితం నాశనం కాకుండా తప్పించుకున్నాను’’ అని సునీల్ చెప్పారు. వివాహ సమయంలో ఖుష్బూ కు ఇచ్చిన నగలు, ఇతర వస్తువులను ఆమె ఇంటి వారు తిరిగి ఇచ్చారు. పరస్పర ఒప్పందం తర్వాత, వధువు తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి హరేంద్ర సింగ్ చెప్పారు. ఒప్పందం అధికారికంగా నమోదు చేయడంతో, తదుపరి చట్టపరమైన సమస్యలు లేకుండా ఈ విషయం మూసివేయబడింది.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..