UP: “హనీమూన్”కి ముందే లవర్తో లేచిపోయిన భార్య.. బతికానంటూ భర్త ఆనందం..
- హనీమూన్కి ముందే లవర్తో పారిపోయిన భార్య..
- ‘‘రఘువంశీలా కాలేదు’’ అని భర్త ఆనందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: రాజా రఘువంశీ, సోనమ్ వ్యవహారం దేశాన్ని కలవరానికి గురిచేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న యువకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ ఘటన చేసింది. హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, అక్కడే అతడిని దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఉండేందుకు, కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. రాజాను చంపేందుకు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ బదౌన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య లవర్ తో కలిసి పారిపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే అతడి భార్య, ప్రియుడితో కలిసి లేచిపోయింది. భర్త ఆమెను వెతకడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా.. ‘‘నేను మరొక రాజా రఘువంశీగా మారకుండా తప్పించుకున్నాను’’ అని సంతోషపడుతున్నారు. తన ప్రియుడితో కలిసి జీవించాలనే భార్య నిర్ణయాన్ని అంగీకరించారు.
Also Read
- Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
- Nijjar killing: ఖలిస్తానీ నిజ్జర్ హత్య భారత్ పాత్ర లేదు.. కెనడా సంచలన వ్యాఖ్యలు..
- West Bengal: "వాడికి ఇదే సరైన శిక్ష".. అత్యాచారం-హత్య కేసు నిందితుడి మృతదేహాన్ని స్వీకరించడానికి నిరాకరించిన తల్లి
- Made in India Weapons: బ్రహ్మోస్ నుంచి ఆకాశ్తీర్ వరకు.. రక్షణ ఎగుమతుల్లో భారత జైత్రయాత్ర
Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..
ఖుష్బూకు మే 17న సునీల్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అత్తామామల ఇంటికి వెళ్లింది. 9 రోజుల తర్వాత వివాహ సంప్రదాయాల్లో భాగంగా పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత, తన ప్రియుడితో అక్కడి నుంచి పారిపోయింది. సునీల్ తన భార్య కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నప్పుడు, ఖుష్బూ సోమవారం పోలీస్ స్టేషన్లో కనిపించి తన ప్రేమికుడితో పారిపోయినట్లు ఒప్పుకుంది. సునీల్ తన భార్య నిర్ణయాన్ని అంగీకరించాడు.
‘‘ఆమెను మా హనీమూన్ కోసం నైనిటాల్కు తీసుకెళ్లాలని నేను ప్లాన్ చేసాను. కానీ ఆమె తన ప్రేమికుడితో ఉండాలనుకుంటే, నేను కూడా సంతోషంగా ఉన్నాను. మరో రాజా రఘువంశీగా మారకుండా నేను తప్పించుకున్నాను! ఇప్పుడు మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాము. నా జీవితం నాశనం కాకుండా తప్పించుకున్నాను’’ అని సునీల్ చెప్పారు. వివాహ సమయంలో ఖుష్బూ కు ఇచ్చిన నగలు, ఇతర వస్తువులను ఆమె ఇంటి వారు తిరిగి ఇచ్చారు. పరస్పర ఒప్పందం తర్వాత, వధువు తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి హరేంద్ర సింగ్ చెప్పారు. ఒప్పందం అధికారికంగా నమోదు చేయడంతో, తదుపరి చట్టపరమైన సమస్యలు లేకుండా ఈ విషయం మూసివేయబడింది.
తాజావార్తలు
-
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
-
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..