UP: “హనీమూన్”కి ముందే లవర్తో లేచిపోయిన భార్య.. బతికానంటూ భర్త ఆనందం..
- హనీమూన్కి ముందే లవర్తో పారిపోయిన భార్య..
- ‘‘రఘువంశీలా కాలేదు’’ అని భర్త ఆనందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: రాజా రఘువంశీ, సోనమ్ వ్యవహారం దేశాన్ని కలవరానికి గురిచేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్న యువకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా ఈ ఘటన చేసింది. హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశీని మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్, అక్కడే అతడిని దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఉండేందుకు, కలిసి మర్డర్ ప్లాన్ చేశారు. రాజాను చంపేందుకు ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు.
ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ బదౌన్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్య లవర్ తో కలిసి పారిపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే అతడి భార్య, ప్రియుడితో కలిసి లేచిపోయింది. భర్త ఆమెను వెతకడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా.. ‘‘నేను మరొక రాజా రఘువంశీగా మారకుండా తప్పించుకున్నాను’’ అని సంతోషపడుతున్నారు. తన ప్రియుడితో కలిసి జీవించాలనే భార్య నిర్ణయాన్ని అంగీకరించారు.
Also Read
- Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..
ఖుష్బూకు మే 17న సునీల్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అత్తామామల ఇంటికి వెళ్లింది. 9 రోజుల తర్వాత వివాహ సంప్రదాయాల్లో భాగంగా పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత, తన ప్రియుడితో అక్కడి నుంచి పారిపోయింది. సునీల్ తన భార్య కనిపించకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నప్పుడు, ఖుష్బూ సోమవారం పోలీస్ స్టేషన్లో కనిపించి తన ప్రేమికుడితో పారిపోయినట్లు ఒప్పుకుంది. సునీల్ తన భార్య నిర్ణయాన్ని అంగీకరించాడు.
‘‘ఆమెను మా హనీమూన్ కోసం నైనిటాల్కు తీసుకెళ్లాలని నేను ప్లాన్ చేసాను. కానీ ఆమె తన ప్రేమికుడితో ఉండాలనుకుంటే, నేను కూడా సంతోషంగా ఉన్నాను. మరో రాజా రఘువంశీగా మారకుండా నేను తప్పించుకున్నాను! ఇప్పుడు మేము ముగ్గురం సంతోషంగా ఉన్నాము. నా జీవితం నాశనం కాకుండా తప్పించుకున్నాను’’ అని సునీల్ చెప్పారు. వివాహ సమయంలో ఖుష్బూ కు ఇచ్చిన నగలు, ఇతర వస్తువులను ఆమె ఇంటి వారు తిరిగి ఇచ్చారు. పరస్పర ఒప్పందం తర్వాత, వధువు తన ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి హరేంద్ర సింగ్ చెప్పారు. ఒప్పందం అధికారికంగా నమోదు చేయడంతో, తదుపరి చట్టపరమైన సమస్యలు లేకుండా ఈ విషయం మూసివేయబడింది.
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!