West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లోని ఝార్గ్రామ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ‘ఝల్మురి’ వడ్డించిన స్థానిక దుకాణదారుడు ఇప్పుడు ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ బెదిరింపులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి వస్తున్నాయని బాధితుడు ఆరోపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మోడీ కాన్వాయ్ ఆగిన క్షణంలో మారిపోయిన జీవితం
ఏప్రిల్ 19న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఝార్గ్రామ్కు వెళ్లారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఆయన కాన్వాయ్ తిరుగు ప్రయాణంలో ఉండగా, రోడ్డు పక్కన ‘ఝల్మురి’ అమ్ముతున్న బిక్రమ్ సౌ దుకాణం వద్ద అకస్మాత్తుగా ఆగింది. అక్కడ బిక్రమ్ స్వయంగా తయారుచేసిన ఝల్మురిని ప్రధాని మోడీ ఆస్వాదించి, అతనితో కొద్దిసేపు మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిక్రమ్ ఒక్కసారిగా ప్రజాదరణ పొందాడు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
వైరల్ అయిన తర్వాత మొదలైన బెదిరింపులు
అయితే, సోషల్ మీడియాలో గుర్తింపు పెరిగిన కొద్దిరోజులకే పరిస్థితి మారిపోయిందని బిక్రమ్ సౌ చెబుతున్నాడు. తన మొబైల్ ఫోన్కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి వరుసగా కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించాడు. ఈ కాల్స్లో తనను, తన కుటుంబ సభ్యులను తీవ్ర పరిణామాలతో బెదిరిస్తున్నారని, కొందరు చంపేస్తామని కూడా హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై బిక్రమ్ సౌ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్ వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కూడా కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడం ఒక సాధారణ దుకాణదారుడి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఈ ఘటన చూపిస్తోంది. మరోవైపు.. ఝార్గ్రామ్ ప్రాంతంలో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ వ్యక్తి ప్రధానమంత్రికి తినుబండారం వడ్డించిన కారణంగా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కోవాల్సి రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!