Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి
- రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త ఉత్తర్వును జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, గుర్తింపు పొందిన మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు జరిగే ప్రార్థనా సమావేశాలలో ‘వందేమాతరం ‘ జాతీయ గీతాన్ని ఆలపించడం ఇకపై తప్పనిసరి.
ఈ ప్రభుత్వ నిర్ణయం మదర్సా విద్యా వ్యవస్థలో ఒక ప్రధాన మార్పుగా పరిగణిస్తున్నారు. గతంలో అమలులో ఉన్న అన్ని ఉత్తర్వులు, పద్ధతులను రద్దు చేస్తూ, ఈ కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఈ ఆదేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని పరిధిలోకి ప్రభుత్వ మోడల్ మదర్సాలు, ప్రభుత్వ సహాయం పొందే మదర్సాలు, ప్రభుత్వ సహాయం పొందని గుర్తింపు పొందిన మదర్సాలు, ఎంఎస్కే, ఎస్ఎస్కే సంస్థలు వస్తాయి.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సంతాలి భాషలో బోధన జరుగుతోందని, అక్కడ ఇప్పటికే “వందేమాతరం” గీతాన్ని ఆలపిస్తున్నారని అన్నారు. అందువల్ల, మదర్సాలలో దీనిని అమలు చేయడంలో ఎలాంటి సమస్య ఉండకూడదని ఆయన అన్నారు. ఇది జాతీయవాదం, క్రమశిక్షణకు సంబంధించిన విషయమని తెలిపారు.
అంతకుముందు, మే 13వ తేదీ సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనా సమావేశాల సమయంలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆ తర్వాత, ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ నోటిఫికేషన్ను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకోవడంతో, ఈ విషయంపై మరింత చర్చ జరిగింది. ఇప్పుడు, విద్యా శాఖ ఆదేశాల తర్వాత, అన్ని విద్యా సంస్థలలో ఏకరీతి ప్రార్థన విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని మదర్సా విద్యా డైరెక్టరేట్ ఉత్తర్వు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!