Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి
- రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త ఉత్తర్వును జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, గుర్తింపు పొందిన మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు జరిగే ప్రార్థనా సమావేశాలలో ‘వందేమాతరం ‘ జాతీయ గీతాన్ని ఆలపించడం ఇకపై తప్పనిసరి.
ఈ ప్రభుత్వ నిర్ణయం మదర్సా విద్యా వ్యవస్థలో ఒక ప్రధాన మార్పుగా పరిగణిస్తున్నారు. గతంలో అమలులో ఉన్న అన్ని ఉత్తర్వులు, పద్ధతులను రద్దు చేస్తూ, ఈ కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఈ ఆదేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీని పరిధిలోకి ప్రభుత్వ మోడల్ మదర్సాలు, ప్రభుత్వ సహాయం పొందే మదర్సాలు, ప్రభుత్వ సహాయం పొందని గుర్తింపు పొందిన మదర్సాలు, ఎంఎస్కే, ఎస్ఎస్కే సంస్థలు వస్తాయి.
Also Read
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సంతాలి భాషలో బోధన జరుగుతోందని, అక్కడ ఇప్పటికే “వందేమాతరం” గీతాన్ని ఆలపిస్తున్నారని అన్నారు. అందువల్ల, మదర్సాలలో దీనిని అమలు చేయడంలో ఎలాంటి సమస్య ఉండకూడదని ఆయన అన్నారు. ఇది జాతీయవాదం, క్రమశిక్షణకు సంబంధించిన విషయమని తెలిపారు.
అంతకుముందు, మే 13వ తేదీ సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థనా సమావేశాల సమయంలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆ తర్వాత, ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ నోటిఫికేషన్ను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకోవడంతో, ఈ విషయంపై మరింత చర్చ జరిగింది. ఇప్పుడు, విద్యా శాఖ ఆదేశాల తర్వాత, అన్ని విద్యా సంస్థలలో ఏకరీతి ప్రార్థన విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని మదర్సా విద్యా డైరెక్టరేట్ ఉత్తర్వు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!