Bengal Elections: పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ బుధవారం జరిగాయి. ఈ దశలో కూడా బెంగాల్ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొదటి విడతలో బెంగాల్ పోలింగ్ శాతం 90 శాతాన్ని దాటింది. రెండో విడతలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం 89.99 శాతానికి చేరుకుంది. 2021లో ఇదే 142 స్థానాలకు 80.4 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు దీనిని అధిగమించి ప్రజలు ఓటు వేశారు.
Read Also: Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా పూర్బ బర్ధమాన్ జిల్లాలో అత్యధికంగా 92.46 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తర కోల్కతా నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల నాటికి 87.77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ హై-ఓల్టేజ్ ఎన్నికల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెల్లడవుతాయి.
