Karnataka: 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ విక్రమ్ గౌడ్ ఎన్కౌంటర్
- 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ విక్రమ్ గౌడ్ ఎన్కౌంటర్
- ధృవీకరించిన రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 ఏళ్లుగా కర్ణాటకకు కంటిలో నలుసుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కిల్లర్ విక్రమ్ గౌడ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఉడిపిలో జరిగిన ఎదురుకాల్పుల్లో విక్రమ్ గౌడ్ మృతిచెందాడు. నక్సల్ నాయకుడు విక్రమ్ గౌడ హతమైనట్లు రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర ధృవీకరించారు. విక్రమ్ గౌడ్ మావో కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటాడని.. రాష్ట్రాల మధ్య నిత్యం తిరుగుతున్నాడని తెలిపారు. 2018 నుంచి కర్ణాటకలో నక్సల్స్ కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా విక్రమ్ గౌడ్ పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడు. సోమవారం ఉడిపిలోని కబ్బినాలే అడవుల్లో యాంటీ నక్సల్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించింది. వారికి ఎదురుపడ్డ విక్రమ్ను యాంటీ నక్సల్ ఫోర్స్ హతమార్చింది. ఉడిపి జిల్లాలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాగ్రి తీసుకునేందుకు వచ్చినట్లు ఉడిపి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉడిపి పోలీసు సిబ్బంది హెబ్రీ తాలూకా సమీపంలోని ఒక ప్రదేశానికి వెళ్లారు. విక్రమ్ గౌడ్ నక్సల్స్ ఉద్యమంలో కీలక వ్యక్తి అని, దశాబ్దాలుగా పట్టుబడకుండా తప్పించుకున్నాడని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. “నక్సల్ గ్రూప్ చురుకుగా ఉండేది, మరియు విక్రమ్ చాలా కాలంగా వాంటెడ్ నక్సల్ నాయకుడు. ఆపరేషన్ సమయంలో అతను పోలీసు అధికారులపై కాల్పులు జరిపాడు, ప్రతీకార చర్యను ప్రేరేపించాడు, దాని ఫలితంగా అతని మరణానికి దారితీసింది,”అని పరమేశ్వర చెప్పారు.
కబ్బినాలే అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. విక్రమ్ గౌడ్ ఎదురుపడగా.. అతనితో పాటు మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అడవిలోకి తప్పించుకున్నారని హోంమంత్రి వెల్లడించారు. మిగిలిన అనుమానితుల జాడ కోసం ఏఎన్ఎఫ్ బృందం కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!