VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
- వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి
- రోజువారీ కనీస వేతనం రూ.300
- తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ కార్మికులకు మరింత ఉపాధి, మెరుగైన ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం (VB-GRAMJEE) బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు చెల్లించే రోజువారీ వేతనాలను సవరించడంతో పాటు, ఉపాధి హామీని కూడా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రోజుకు కనీస వేతనం రూ.300
కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనైనా గ్రామీణ కార్మికులకు రోజుకు రూ.300 కంటే తక్కువ వేతనం ఉండదు. గతంలో అనేక రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువగా ఉండగా, కొత్త నిర్ణయంతో కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
సగటు వేతనం రూ.327కు పెంపు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త వేతనాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం సుమారు రూ.299 నుంచి రూ.327కు పైగా పెరిగింది. అంటే ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.28 అదనపు ఆదాయం లభించనుంది. ఇది జాతీయ స్థాయిలో 10 శాతానికి పైగా పెరుగుదలగా భావిస్తున్నారు.
తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గతంలో తక్కువ వేతనాలు ఉండటంతో, అక్కడ 15 నుంచి 25 శాతం వరకు వేతనాలను పెంచారు. దీంతో ఈ రాష్ట్రాల్లోని లక్షలాది గ్రామీణ కార్మికులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
ఉపాధి హామీ 125 రోజులకు
ఈ పథకం కింద మరో కీలక మార్పు ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం. దీని ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో అదనంగా 25 రోజుల పని అవకాశం లభిస్తుంది. పెరిగిన వేతనాలు, అదనపు ఉపాధి కారణంగా గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అధిక వేతనాలున్న రాష్ట్రాల్లో కూడా పెంపు
ఇప్పటికే అధిక వేతనాలు అమల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా కొత్త రేట్లను అమలు చేశారు. హర్యానాలో రోజువారీ వేతనం రూ.409, గోవాలో రూ.406, కేరళలో రూ.401గా నిర్ణయించారు. అలాగే కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేతనాలను ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI), ఇతర ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు, స్థానిక మార్కెట్లలో డిమాండ్ను బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!