VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
- వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి
- రోజువారీ కనీస వేతనం రూ.300
- తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ కార్మికులకు మరింత ఉపాధి, మెరుగైన ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం (VB-GRAMJEE) బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు చెల్లించే రోజువారీ వేతనాలను సవరించడంతో పాటు, ఉపాధి హామీని కూడా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రోజుకు కనీస వేతనం రూ.300
కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనైనా గ్రామీణ కార్మికులకు రోజుకు రూ.300 కంటే తక్కువ వేతనం ఉండదు. గతంలో అనేక రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువగా ఉండగా, కొత్త నిర్ణయంతో కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించారు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
సగటు వేతనం రూ.327కు పెంపు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త వేతనాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం సుమారు రూ.299 నుంచి రూ.327కు పైగా పెరిగింది. అంటే ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.28 అదనపు ఆదాయం లభించనుంది. ఇది జాతీయ స్థాయిలో 10 శాతానికి పైగా పెరుగుదలగా భావిస్తున్నారు.
తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గతంలో తక్కువ వేతనాలు ఉండటంతో, అక్కడ 15 నుంచి 25 శాతం వరకు వేతనాలను పెంచారు. దీంతో ఈ రాష్ట్రాల్లోని లక్షలాది గ్రామీణ కార్మికులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
ఉపాధి హామీ 125 రోజులకు
ఈ పథకం కింద మరో కీలక మార్పు ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం. దీని ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో అదనంగా 25 రోజుల పని అవకాశం లభిస్తుంది. పెరిగిన వేతనాలు, అదనపు ఉపాధి కారణంగా గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అధిక వేతనాలున్న రాష్ట్రాల్లో కూడా పెంపు
ఇప్పటికే అధిక వేతనాలు అమల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా కొత్త రేట్లను అమలు చేశారు. హర్యానాలో రోజువారీ వేతనం రూ.409, గోవాలో రూ.406, కేరళలో రూ.401గా నిర్ణయించారు. అలాగే కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేతనాలను ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI), ఇతర ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు, స్థానిక మార్కెట్లలో డిమాండ్ను బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
-
Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!