VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
- వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి
- రోజువారీ కనీస వేతనం రూ.300
- తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ కార్మికులకు మరింత ఉపాధి, మెరుగైన ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ పథకం (VB-GRAMJEE) బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద గ్రామీణ కార్మికులకు చెల్లించే రోజువారీ వేతనాలను సవరించడంతో పాటు, ఉపాధి హామీని కూడా 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రోజుకు కనీస వేతనం రూ.300
కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనైనా గ్రామీణ కార్మికులకు రోజుకు రూ.300 కంటే తక్కువ వేతనం ఉండదు. గతంలో అనేక రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300 కంటే తక్కువగా ఉండగా, కొత్త నిర్ణయంతో కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించారు.
Also Read
సగటు వేతనం రూ.327కు పెంపు
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త వేతనాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం సుమారు రూ.299 నుంచి రూ.327కు పైగా పెరిగింది. అంటే ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.28 అదనపు ఆదాయం లభించనుంది. ఇది జాతీయ స్థాయిలో 10 శాతానికి పైగా పెరుగుదలగా భావిస్తున్నారు.
తక్కువ వేతనాలున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం
ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గతంలో తక్కువ వేతనాలు ఉండటంతో, అక్కడ 15 నుంచి 25 శాతం వరకు వేతనాలను పెంచారు. దీంతో ఈ రాష్ట్రాల్లోని లక్షలాది గ్రామీణ కార్మికులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
ఉపాధి హామీ 125 రోజులకు
ఈ పథకం కింద మరో కీలక మార్పు ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం. దీని ద్వారా అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో అదనంగా 25 రోజుల పని అవకాశం లభిస్తుంది. పెరిగిన వేతనాలు, అదనపు ఉపాధి కారణంగా గ్రామీణ కుటుంబాల వార్షిక ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అధిక వేతనాలున్న రాష్ట్రాల్లో కూడా పెంపు
ఇప్పటికే అధిక వేతనాలు అమల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా కొత్త రేట్లను అమలు చేశారు. హర్యానాలో రోజువారీ వేతనం రూ.409, గోవాలో రూ.406, కేరళలో రూ.401గా నిర్ణయించారు. అలాగే కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాలను పెంచారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేతనాలను ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI), ఇతర ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు, స్థానిక మార్కెట్లలో డిమాండ్ను బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!