NTV Telugu Site icon

వ్యాక్సిన్ వేయించుకుంటే 97 శాతానికి పైగా రక్షణ… 

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దేశంలో మొత్తం 18,29,26,460 మందికి వ్యాక్సిన్ అందించారు.  కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి కరోనా సోకుతుండగా, మరికొందరు కరోనాతో మృతి చెందుతున్నారు.  ఇలాంటి కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి.  అయితే, కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 97.38శాతం మందిలో రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది.  కరోనా మహమ్మారి వైరస్ పై వ్యాక్సిన్  లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఈ నివేదికలో వెల్లడైంది.