Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath’s sensational decision: సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. యోగీ చరిష్మాతో యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సంచనల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఉత్తర్ ప్రదేశ్ లో మత కలహాలకు చెక్ పెట్టడంతో పాటు క్రైం రేట్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో డెవలప్మెంట్ ను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం యూపీలో ఆగస్టు 15కి సెలవును రద్దు చేసింది యోగీ సర్కార్.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
Read Also: Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
ఇంతకు దీనికి అసలు కారణం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావడమే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని యోగీ సర్కార్ భావించింది. గతంలో ఆగస్టు 15 రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జెండా ఎగరవేసి, చిన్న చిన్న కార్యక్రమాలతో వేడుకలను ముగించకుండా.. ప్రతీ ఒక్కరు తమ కార్యాలయానికి విధిగా హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సూచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు యూపీ సీఎస్ డీఎస్ మిశ్రా తెలిపారు. సాధారణంగా క్లీనింగ్ డ్రైవ్ దీపావళి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ సారి దీన్ని జాతీయ కార్యక్రమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటుంది యూపీ సర్కార్.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!