Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath’s sensational decision: సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. యోగీ చరిష్మాతో యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సంచనల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఉత్తర్ ప్రదేశ్ లో మత కలహాలకు చెక్ పెట్టడంతో పాటు క్రైం రేట్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో డెవలప్మెంట్ ను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం యూపీలో ఆగస్టు 15కి సెలవును రద్దు చేసింది యోగీ సర్కార్.
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
Read Also: Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
ఇంతకు దీనికి అసలు కారణం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావడమే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని యోగీ సర్కార్ భావించింది. గతంలో ఆగస్టు 15 రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జెండా ఎగరవేసి, చిన్న చిన్న కార్యక్రమాలతో వేడుకలను ముగించకుండా.. ప్రతీ ఒక్కరు తమ కార్యాలయానికి విధిగా హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సూచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు యూపీ సీఎస్ డీఎస్ మిశ్రా తెలిపారు. సాధారణంగా క్లీనింగ్ డ్రైవ్ దీపావళి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ సారి దీన్ని జాతీయ కార్యక్రమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటుంది యూపీ సర్కార్.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!