Uttar Pradesh: యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు సెలవు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi Adityanath’s sensational decision: సీఎం యోగీ ఆదిత్యనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. యోగీ చరిష్మాతో యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సంచనల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారారు. ఉత్తర్ ప్రదేశ్ లో మత కలహాలకు చెక్ పెట్టడంతో పాటు క్రైం రేట్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో డెవలప్మెంట్ ను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తొలిసారి సెలవు రద్దు చేశాడు. 75 ఏళ్లలో ఇలా సెలవు రద్దు చేయడం ఇదే తొలిసారి. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఆ రోజు విద్యాలయాలు, ఆఫీసులతో పాటు అన్ని సంస్థలకు సెలువు ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం యూపీలో ఆగస్టు 15కి సెలవును రద్దు చేసింది యోగీ సర్కార్.
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
Read Also: Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్
ఇంతకు దీనికి అసలు కారణం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావడమే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని యోగీ సర్కార్ భావించింది. గతంలో ఆగస్టు 15 రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జెండా ఎగరవేసి, చిన్న చిన్న కార్యక్రమాలతో వేడుకలను ముగించకుండా.. ప్రతీ ఒక్కరు తమ కార్యాలయానికి విధిగా హాజరై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం సూచింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక క్లీనింగ్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు యూపీ సీఎస్ డీఎస్ మిశ్రా తెలిపారు. సాధారణంగా క్లీనింగ్ డ్రైవ్ దీపావళి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ సారి దీన్ని జాతీయ కార్యక్రమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటుంది యూపీ సర్కార్.
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?