Uttar Pradesh- Yogi: మదర్సాల్లో జాతీయగీతాన్ని తప్పనిసరి చేసిన యోగీ సర్కార్
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లే ముందు అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లోనే జాతీయ గీతాన్ని ఆలపించే వారు. అయితే యోగీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిగ్ డిసిషన్ తీసుకున్నారు.
రంజాన్ సెలవులు ముగిసిన తర్వాత మే 12 నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఈ రోజు నుంచే జాతీయ గీతం పాడటాన్ని తప్పనిసరిగా పాటించాలని సర్కార్ అన్ని మదర్సాలను ఆదేశించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ గత నెలలో మదర్సాలలో జాతీయవాదాన్ని బోధించాలని ఆదేశించిన తర్వాత ప్రస్తుత జాతీయ గీతం తప్పని సరిపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 16,461 మదర్సాలు ఉండగా… వీటిలో 560 మదర్సాలు ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్నాయి.
Also Read
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
ఇదిలా ఉంటే యోగి ఆదిత్య నాథ్ మంత్రి వర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ ఇప్పుడు మదర్సాల్లోని విద్యార్థులు గణితం, సైన్స్ తో పాటు మత గ్రంథాలను కూడా చదువుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. మదర్సాల్లోని విద్య మైనారిటీలకు చాలా అవసరం అని… వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కీలకమని, జాతీయ గీతం ఆలపించేటప్పుడు విద్యార్థులు సమాజ విలువలు నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ముస్లిం మత పెద్దలు మాత్రం మేము హమ్ద్ (అల్లాకు స్తోత్రాలు), సలామ్ ( అల్లాకు నమస్కారాలు) చేసి తరుగతులను ప్రారంభిస్తామని.. జాతీయ గీతం తప్పనిసరి కాదని వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
-
Trump: ఇరాన్తో యుద్ధం ముగిసింది.. వైట్హౌస్ కీలక ప్రకటన
-
EU Car Import Duties: ఈయూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ.. కార్లు, ట్రక్కులపై 25% సుంకం విధించిన ట్రంప్
-
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!