Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire accident in Uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేదికలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ముందుగా ఓ పెళ్లి వేదికలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత అవి మూడొంతస్తుల భవనానికి వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న ఐదుగురు మరణించారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంత ఒకే కుటుంబానికి చెందినవారే.
Read Also: Gandhi Hospital Doctors: మత్తుమందు ఇవ్వకుండా ‘అడవిదొంగ’ సినిమా చూపించి సర్జరీ చేసిన వైద్యులు
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మొరాదాబాద్ లోని అమరుద్దీన్ అనే వ్యకి మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుంది. ప్రాణాలతో ఉన్న ఏడుగురిని కాపాడారు. అయితే ఈ ప్రమాదంలో అమరుద్దీన్ అత్త సమర్, కోడలు షామా, కుతురు నఫియా, కొడుకు ఇజాబ్ తో పాటు మరో వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?