USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- భారత్ శక్తివంతమైన దేశం,సైన్యాన్ని వేగంగా ఆధునీకరిస్తోంది.
- హిందూ మహాసముద్రంలో శక్తి సమతుల్యతకు భారత్ కీలకం
- భారత్తో కలిసి ఆయుధాల తయారీకి సిద్ధమన్న అమెరికా.
- అమెరికా రక్షణ మంత్రి హెగ్సేత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ భారత్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక ‘‘శక్తివంతమైన దేశం’’ అని, భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని అన్నారు. ఇదే సమయంలో గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేసినట్లు చెప్పారు. అయితే, పలు సందర్బాల్లో సిందూర్ ఆపే విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే నిలిపేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతీ ఏడాది సింగపూర్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, ఉన్నత సైనికాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంలో 44 దేశాలు పాల్గొన్నాయి. శనివారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ ప్రసంగిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
భారత్ తన సైన్యాన్ని ఆధునీకీకరిస్తోందని చెప్పడంతో పాటు, హిందూ మహాసముద్రంలో పవర్ బ్యాలెన్స్ను కాపాడటంలో సహాయపడుతుందని తెలిపారు. భారతదేశం తన భారీ, ముఖ్యమైన సైనిక అవసరాలను తీర్చడానికి సొంత కర్మాగారాలను, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటోందని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో కలిసి సంయుక్తంగా ఆయుధాలు, సైనిక సామగ్రిని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆసియా ముఖ్యమైన ప్రాంతమని, ఈ ప్రాంతంపై ఒక్క దేశం ఆధిపత్యం చెలాయించడాన్ని కోరుకోవడం లేదని చైనాను గుర్తించి ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!