UP Girl Case: 2015లో హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత బతికొచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Girl Who Declared As Dead 7 Years Ago Found Alive In Hathras: అప్పుడప్పుడు కొన్ని ఊహకందని షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. 2015లో హత్యకు గురైందనుకున్న ఓ యువతి.. ఏడేళ్ల తర్వాత తిరిగి సజీవంగా కనిపించింది. పాపం.. ఈ కేసులో ఓ యువకుడు ఎలాంటి తప్పు చేయకపోయినా, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మిన అతని తల్లి.. ఎంతో శ్రమించి ఈ మిస్టరీని ఛేదించింది. ఒక త్రిల్లర్ సినిమాని తలపించే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
2015లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక అనుకోకుండా అదృశ్యమైంది. దీంతో ఆ బాలిక తండ్రి.. విష్ణు అనే 18 ఏళ్ల యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి, విష్ణు తన కూతురిని కిడ్నాప్ చేశాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో.. పోలీసులు విష్ణుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాను కిడ్నాప్ చేయలేదని విష్ణు ఎంత మొత్తుకున్నా.. పోలీసులు వినలేదు. ఆమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పు అంటూ అతడ్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కట్ చేస్తే.. ఆగ్రాలో పోలీసులకు ఒక బాలిక మృతదేహం లభించింది. అది తన కుమార్తె మృతదేహమేనని తండ్రి చెప్పడంతో.. విష్ణుపై హత్య కేసు నమోదు చేసి, అతడ్ని జైలుకు పంపించారు. అయితే.. విష్ణు తల్లి మాత్రం తన కుమారుడు ఏ తప్పు చేయలేదని గట్టిగా నమ్మింది. తన ఆవేదన పోలీసులు వినిపించుకోకపోవడంతో.. తానే రంగంలోకి దిగి, ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
Also Read
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
కనిపించకుండా పోయిన ఆ బాలిక ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు.. ఏడేళ్ల తర్వాత ఆ తల్లి శ్రమ ఫలించింది. హత్రాస్లో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి విష్ణు తల్లి వెళ్లింది. అక్కడ ఆమెకు 22 ఏళ్ల వయసున్న ఓ యువతి కనిపించింది. ఏడేళ్ల క్రితం తప్పిపోయిన బాలికే అని నిర్ధారించుకొని.. సమాచారాన్ని పోలీసులకు అందింది. దీంతో.. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని, సోమవారం అలీగఢ్ కోర్టులో ప్రవేశపెట్టి, మంగళవారం మెజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డీఎన్ఏ టెస్ట్ నిర్వహించి, తండ్రి డీఎన్ఏతో పోల్చి చూస్తామని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆ యువతికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి, ఆ యువతి విష్ణుని బలిపశువుని చేసింది.
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!