NTV Telugu Site icon

Lightning Strike: మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటు.. రైతు మృతి

Lightning Strike

Lightning Strike

Lightning Strike: ఉరుములు, పిడుగులు పడుతున్న వేళ ఎలక్ట్రానిక డివైజ్ వాడకూడదని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ సూచనలను పట్టించుకోరు. తాజాగా ఇలాగే పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుకు గురై మరణించాడు.

Read Also: India’s fuel exports: యూరప్‌కి అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా అవతరించిన భారత్..

శ్రీపాల్ అనే రైతు వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో ఫోన్ లో మాట్లాడుతుండగా అతడిపై పిడుగుపడింది. దీంతో శ్రీపాల్ అక్కడిక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుని సంఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకునే సరికే బాధితుడు మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.