Uttar Pradesh: పేపర్ లీకులకు చేశారో అంతే సంగతి.. జీవిత ఖైదు, రూ. 1 కోటి జరిమానా..
- పేపర్ లీక్పై యూపీ సర్కార్ కఠిన చట్టం..
- జీవిత ఖైదు- రూ. 1 కోటి జరిమానా..
- సీఎం యోగి సంచలన నిర్ణయం..
- ఆర్డినెన్స్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paper leak cases: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్ కేసులు దేశవ్యాప్తంగా సంచలన రేపాయి. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి. ఈ ఆందోళనల నడుమ పరీక్ష బాధ్యతలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్మాణం, పనితీరు, పాదర్శకతను మెరుగుపరిచేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
Read Also: Triple Talaq: బీజేపీకి సపోర్ట్ చేసినందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఇదిలా ఉంటే, పేపర్ లీకులను అరికట్టేందుకు సీఎం యోగి నేతృత్వంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు జీవిత ఖైదుతో పాటు రూ. 1కోటి వరకు జరిమానా విధించాలనే కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి యోగి అధ్యక్షతన జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) ఆర్డినెన్స్ 2024కి యూపీ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీ సమావేశాలు లేనందుకున ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆర్డినెన్స్లోని నిబంధనలు డిగ్రీ, డిప్లొమా మరియు ఇతర కోర్సులకు ప్రవేశ పరీక్షలతో పాటు పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ పరీక్షలకు, రెగ్యులరైజేషన్ లేదా ప్రమోషన్ పరీక్షలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. నకిలీ పరీక్షా పత్రాల పంపిణీ మరియు నకిలీ ఉద్యోగ వెబ్సైట్లను తయారు చేయడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వారికి రెండేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. పరీక్షలు నిర్వహంచే కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి పరీక్ష రద్దు వల్ల అయ్యే ఖర్చును తీసుకునేందుకు, వాటిని బ్లాక్ లిస్టు చేయడానికి కూడా ఆర్డినెన్స్ నిబంధనలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!