CM Yogi: అసద్ ఎన్కౌంటర్.. వైరల్ అవుతున్న సీఎం యోగి “మట్టిలో కలిపేస్తా” కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్లో హతమైన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత వ్యాఖ్య మళ్లీ ట్రెండ్ అవుతోంది. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అయ్యాయి. తాజాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, మరో నిందితుడు గులాంలను ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చంపేశారు. యూపీ ఎస్టీఎఫ్ టీం, నిందితులకు మధ్య దాదాపుగా 40 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.
2005 బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను అత్యంత దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. ఈ కేసులో అసద్ తో పాటు గులాం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు. గత రెండు నెలల నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హతం అయ్యారు.
Also Read
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
Read Also: Akhilesh Yadav: అసద్ అహ్మద్ది బూటకపు ఎన్కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
https://twitter.com/SmokingLiberals/status/1646418302628159488
ఇదిలా ఉంటే ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సీఎం తన మాటను నిలబెట్టుకున్నారంటూ పలువురు నెటిజెట్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగీ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైపు వేటు చూపిస్తూ… ‘‘నేను మాఫియాను నేలమట్టం చేస్తా, మట్టిలో కలిపేస్తా’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతీక్ అహ్మద్ ను పెంచి పోషించిందే సమాజ్ వాదీ పార్టీ అని, దాని వెన్ను విరిచే పనిలో మేము ఉన్నామని అన్నారు.
అతిక్ అహ్మద్ ను ఉద్దేశిస్తూ..‘‘స్పీకర్ సార్, అతను అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ పాథర్, వారి నరాల్లో నేరం ఉంది, నేను ఈ రోజు సభకు చెబుతున్నాను, నేను ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తా’’అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మరోసారి యోగి చేసిన మాస్ వార్నింగ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!