Union Minister Kaushal Kishore: “చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయొచ్చా.?” శ్రద్ధా హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister’s remarks on live-in relationship sparks row: ఢిల్లీలో 27 ఏళ్ల యువతి శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు. శ్రద్ధావిగా చెప్పబడుతున్న ఎముకలను, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపుమరకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు.
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందించారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారి తీస్తుందంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను ఆయన తప్పు పట్టారు. చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి సంబంధాలను పెట్టుకోకూడదని సూచించారు. అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని.. అలా చేయాల్సి వస్తే సరైన రిజిస్ట్రేషన్ ఉండాలని.. తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి ఉండాలని సూచించారు. శ్రద్ధా వాకర్ హత్యకు ఆమె కారణం అని అన్నారు. ఈ హత్య నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ‘‘ఆశ్చర్యకరంగా ఈ దేశంలో పుట్టడానికి మహిళలే కారణం అని చెప్పలేదు..సిగ్గు లేకుండా క్రూరంగా స్త్రీని నిందిచారు’’ అంటూ ట్వీట్ చేశారు. హత్యకు గురైన శ్రద్ధావాకర్, అఫ్తాబ్ లు ఇద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు. మే 18న గొడవలు కావడంతో అఫ్తాబ్, శ్రద్ధాను గొంతుకోసి చంపాడు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా అడినందుకు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఈ కారణంగానే అఫ్తాబ్ హత్య చేశాడు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!