Union Minister Kaushal Kishore: “చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయొచ్చా.?” శ్రద్ధా హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister’s remarks on live-in relationship sparks row: ఢిల్లీలో 27 ఏళ్ల యువతి శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు. శ్రద్ధావిగా చెప్పబడుతున్న ఎముకలను, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపుమరకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు.
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందించారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారి తీస్తుందంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను ఆయన తప్పు పట్టారు. చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి సంబంధాలను పెట్టుకోకూడదని సూచించారు. అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని.. అలా చేయాల్సి వస్తే సరైన రిజిస్ట్రేషన్ ఉండాలని.. తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి ఉండాలని సూచించారు. శ్రద్ధా వాకర్ హత్యకు ఆమె కారణం అని అన్నారు. ఈ హత్య నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ‘‘ఆశ్చర్యకరంగా ఈ దేశంలో పుట్టడానికి మహిళలే కారణం అని చెప్పలేదు..సిగ్గు లేకుండా క్రూరంగా స్త్రీని నిందిచారు’’ అంటూ ట్వీట్ చేశారు. హత్యకు గురైన శ్రద్ధావాకర్, అఫ్తాబ్ లు ఇద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు. మే 18న గొడవలు కావడంతో అఫ్తాబ్, శ్రద్ధాను గొంతుకోసి చంపాడు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా అడినందుకు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఈ కారణంగానే అఫ్తాబ్ హత్య చేశాడు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!