Union Minister Kaushal Kishore: “చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయొచ్చా.?” శ్రద్ధా హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union minister’s remarks on live-in relationship sparks row: ఢిల్లీలో 27 ఏళ్ల యువతి శ్రద్ధా వాకర్ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు రాత్రి 2 గంటల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరేశారు. శ్రద్ధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు నెలల తర్వాత ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు. శ్రద్ధావిగా చెప్పబడుతున్న ఎముకలను, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపుమరకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు.
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ వర్గం) నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Read Also: Crime : సభ్య సమాజం తలవంచుకునే ఘటన.. ఆరేళ్లుగా బాలికపై తండ్రి, తాత, అంకుల్ అత్యాచారం
చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై స్పందించారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. లివ్ ఇన్ రిలేషన్ షిప్ నేరాలకు దారి తీస్తుందంటూ.. తల్లిదండ్రులను విడిచిపెట్టి, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న చదువుకున్న అమ్మాయిలను ఆయన తప్పు పట్టారు. చదువుకున్న అమ్మాయిలు ఇలాంటి సంబంధాలను పెట్టుకోకూడదని సూచించారు. అమ్మాయిలు సహజీవనం ఎందుకు చేస్తున్నారని.. అలా చేయాల్సి వస్తే సరైన రిజిస్ట్రేషన్ ఉండాలని.. తల్లిదండ్రులు ఒప్పుకోకుంటే కోర్టు మ్యారేజ్ చేసుకుని కలిసి ఉండాలని సూచించారు. శ్రద్ధా వాకర్ హత్యకు ఆమె కారణం అని అన్నారు. ఈ హత్య నుంచి మనం నేర్చుకోవాలని సూచించారు.
ఈ వ్యాఖ్యలపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ‘‘ఆశ్చర్యకరంగా ఈ దేశంలో పుట్టడానికి మహిళలే కారణం అని చెప్పలేదు..సిగ్గు లేకుండా క్రూరంగా స్త్రీని నిందిచారు’’ అంటూ ట్వీట్ చేశారు. హత్యకు గురైన శ్రద్ధావాకర్, అఫ్తాబ్ లు ఇద్దరు 2019 నుంచి డేటింగ్ లో ఉన్నారు. మే 18న గొడవలు కావడంతో అఫ్తాబ్, శ్రద్ధాను గొంతుకోసి చంపాడు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా అడినందుకు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఈ కారణంగానే అఫ్తాబ్ హత్య చేశాడు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!