Chirag Paswan: వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- యూపీ పోలీసుల నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్షం నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తామని యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని విలేకర్లు ప్రశ్నించగా.. ఇది ‘‘పనికిరాని చర్చ’’ అంటూ తోసిపుచ్చారు. దీనిపై చర్చ అనవసరం అని.. అర్థరహితమైన చర్చ అంటూ తిప్పికొట్టారు. దేశంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. అనేక ప్రధాన సమస్యలుండగా దీనిపై చర్చ అవసరమంటారా? అని పేర్కొన్నారు. అయినా చాలా సంవత్సరాలుగా వీధుల్లో నమాజ్ చేస్తున్నారని.. ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.
ఒక విషయం ఏంటంటే అసంబద్ధ అంశాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే.. సమాజంలో.. దేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎటువంటి కారణాలు లేకుండానే సంఘాలు, ప్రజల మధ్య చీలికలు ఏర్పడతాయని.. కనుక ఇలాంటి చర్చలు అర్థరహితం అంటూ కేంద్రమంత్రి మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్రమంత్రిగా ఎలా పని చేస్తున్నానో అడగవచ్చు.. ఇందులో ఏమీ తప్పులేదన్నారు. మిగతా విషయాలు గురించి మాట్లాడితే అపార్థాలు ఏర్పడతాయన్నారు.
Also Read
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
బీజేపీలోని వ్యక్తులు.. వీధుల్లో నమాజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా.. దాన్ని తాను అంగీకరించనన్నారు. 21వ శతాబ్ధానికి చెందిన విద్యావంతుడ్ని.. మతపరమైన విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. తాను బీజేపీ మిత్రపక్షమైనా కూడా మత సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. తాను కూడా ఇఫ్తార్ విందుకు తిలకం పెట్టుకునే హాజరయ్యాను. అది ‘‘నా విశ్వాసం’’.. ఇతరుల మతాన్ని గౌరవిస్తూనే.. ‘‘నా మత విశ్వాసాన్ని’’ మరిచిపోనన్నారు. ఎవరి వ్యక్తిగత విశ్వాసం వారిది అని చెప్పారు. చాలా మంది హిందువుల్లోనే తిలకం పెట్టుకోరు.. అంతమాత్రాన వారంతా హిందువులు కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. ఎవరి విశ్వాసం వారిది.. ఎవరి వ్యక్తిగత విషయాలు వారి సొంత అని అభిప్రాయపడ్డారు. తాను చెప్పేదొకటే.. హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం కంటే.. దేశంలో పరిష్కరించాల్సిన చాలా విషయాలు చాలా ఉన్నాయని.. వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది అని కేంద్రమంత్రి హితవు పలికారు.
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!