Chirag Paswan: వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- యూపీ పోలీసుల నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి, ఎన్డీఏ మిత్రపక్షం నేత చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. ఇటీవల వీధుల్లో నమాజ్ చేస్తే పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేస్తామని యూపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిని విలేకర్లు ప్రశ్నించగా.. ఇది ‘‘పనికిరాని చర్చ’’ అంటూ తోసిపుచ్చారు. దీనిపై చర్చ అనవసరం అని.. అర్థరహితమైన చర్చ అంటూ తిప్పికొట్టారు. దేశంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని.. అనేక ప్రధాన సమస్యలుండగా దీనిపై చర్చ అవసరమంటారా? అని పేర్కొన్నారు. అయినా చాలా సంవత్సరాలుగా వీధుల్లో నమాజ్ చేస్తున్నారని.. ఇప్పుడు దీనిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.
ఒక విషయం ఏంటంటే అసంబద్ధ అంశాల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే.. సమాజంలో.. దేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఎటువంటి కారణాలు లేకుండానే సంఘాలు, ప్రజల మధ్య చీలికలు ఏర్పడతాయని.. కనుక ఇలాంటి చర్చలు అర్థరహితం అంటూ కేంద్రమంత్రి మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్రమంత్రిగా ఎలా పని చేస్తున్నానో అడగవచ్చు.. ఇందులో ఏమీ తప్పులేదన్నారు. మిగతా విషయాలు గురించి మాట్లాడితే అపార్థాలు ఏర్పడతాయన్నారు.
Also Read
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
బీజేపీలోని వ్యక్తులు.. వీధుల్లో నమాజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా.. దాన్ని తాను అంగీకరించనన్నారు. 21వ శతాబ్ధానికి చెందిన విద్యావంతుడ్ని.. మతపరమైన విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. తాను బీజేపీ మిత్రపక్షమైనా కూడా మత సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తెలిపారు. తాను కూడా ఇఫ్తార్ విందుకు తిలకం పెట్టుకునే హాజరయ్యాను. అది ‘‘నా విశ్వాసం’’.. ఇతరుల మతాన్ని గౌరవిస్తూనే.. ‘‘నా మత విశ్వాసాన్ని’’ మరిచిపోనన్నారు. ఎవరి వ్యక్తిగత విశ్వాసం వారిది అని చెప్పారు. చాలా మంది హిందువుల్లోనే తిలకం పెట్టుకోరు.. అంతమాత్రాన వారంతా హిందువులు కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. ఎవరి విశ్వాసం వారిది.. ఎవరి వ్యక్తిగత విషయాలు వారి సొంత అని అభిప్రాయపడ్డారు. తాను చెప్పేదొకటే.. హిందూ-ముస్లింల గురించి మాట్లాడటం కంటే.. దేశంలో పరిష్కరించాల్సిన చాలా విషయాలు చాలా ఉన్నాయని.. వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది అని కేంద్రమంత్రి హితవు పలికారు.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!