Ajay Mishra: ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
union minister Ajay mishra on RAF: ప్రపంచంలోని ఏ దేశానికి కూడా మన దేశం నుంచి ముప్పు లేదని.. ఇప్పడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఆర్ఏఎప్ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిపై అందరి దృష్టి ఉందని ఆయన అన్నారు. ఆర్ఏఎఫ్ లాంటి బలగాలు అందిస్తున్న సేవలు, ప్రదర్శిస్తున్న ధైర్యం సాహసాలు అమోఘం అని.. బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుందని అన్నారు. ఆర్ఏఎఫ్ ఇబ్బందులు, సమస్యలను ఆర్ఏఎఫ్ డీజి నుండి అడిగి తెలుసుకున్నాని..దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని.. ఇందులో భాగంగా బలగాలు ఎంతో శ్రమిస్తున్నాయని.. బలగాలు అందిస్తున్న సేవలను దేశ ప్రజలు మరిచిపోరని అన్నారు.
Read Also: Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కేంద్ర బలగాలు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారో ప్రధానమంత్రి దృష్టిలో ఉంది.. దీని పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నారని తెలిపారు. దేశం ముందడుగు వేయడానికి కేంద్ర బలగాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పొగిడారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్పీఎఫ్ చూపించే పరాక్రమం దేశం మొత్తం చూస్తోందని.. ఎలాంటి పరిస్థితుల్లో అయిన పోరాడటానికి సిద్ధంగా ఉంటారని ఆయన అజయ్ మిశ్రా అన్నారు.
దేశంలో అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చరుకుగా పనిచేస్తోందని..ప్రకృతి విపత్తులు, ఉగ్ర దాడులు, అగ్ని ప్రమాదాలు, విష వాయుల దాడులు,ప్రమాదాలు, ఇతర అపత్కాల సమయం లో ప్రాణాలకు తెగించి రక్షణ కల్పిస్తారని అన్నారు. ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోందని అన్నారు. ప్రధాన మోదీ విజన్ వల్ల భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని.. రక్షణ వ్యవస్థ లోపాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం చూశామని.. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా, బీజాపూర్ ప్రాంతాల్లో బలగాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!