Ajay Mishra: ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
union minister Ajay mishra on RAF: ప్రపంచంలోని ఏ దేశానికి కూడా మన దేశం నుంచి ముప్పు లేదని.. ఇప్పడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ఆర్ఏఎప్ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో కొనసాగుతున్న అభివృద్ధిపై అందరి దృష్టి ఉందని ఆయన అన్నారు. ఆర్ఏఎఫ్ లాంటి బలగాలు అందిస్తున్న సేవలు, ప్రదర్శిస్తున్న ధైర్యం సాహసాలు అమోఘం అని.. బలగాలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు వెన్నంటే ఉంటుందని అన్నారు. ఆర్ఏఎఫ్ ఇబ్బందులు, సమస్యలను ఆర్ఏఎఫ్ డీజి నుండి అడిగి తెలుసుకున్నాని..దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అని.. ఇందులో భాగంగా బలగాలు ఎంతో శ్రమిస్తున్నాయని.. బలగాలు అందిస్తున్న సేవలను దేశ ప్రజలు మరిచిపోరని అన్నారు.
Read Also: Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
కేంద్ర బలగాలు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారో ప్రధానమంత్రి దృష్టిలో ఉంది.. దీని పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నారని తెలిపారు. దేశం ముందడుగు వేయడానికి కేంద్ర బలగాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పొగిడారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్పీఎఫ్ చూపించే పరాక్రమం దేశం మొత్తం చూస్తోందని.. ఎలాంటి పరిస్థితుల్లో అయిన పోరాడటానికి సిద్ధంగా ఉంటారని ఆయన అజయ్ మిశ్రా అన్నారు.
దేశంలో అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ చరుకుగా పనిచేస్తోందని..ప్రకృతి విపత్తులు, ఉగ్ర దాడులు, అగ్ని ప్రమాదాలు, విష వాయుల దాడులు,ప్రమాదాలు, ఇతర అపత్కాల సమయం లో ప్రాణాలకు తెగించి రక్షణ కల్పిస్తారని అన్నారు. ప్రపంచం మొత్తం భారత రక్షణ వ్యవస్థ పనితీరును ప్రశంసిస్తోందని అన్నారు. ప్రధాన మోదీ విజన్ వల్ల భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందని.. రక్షణ వ్యవస్థ లోపాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం చూశామని.. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా, బీజాపూర్ ప్రాంతాల్లో బలగాలు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!