Union Budget 2025 LIVE UPDATE: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఎన్టీవీని లైవ్ అప్ డేట్స్ మీకోసం..
కొత్త పన్ను శ్లాబులు సవరణ..
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5 శాతం
రూ.8-12 లక్షలు - 10 శాతం
రూ.12-16 లక్షలు - 15 శాతం
రూ.16-20 లక్షలు - 20 శాతం
రూ.20-24 లక్షలు - 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం
సోమవారానికి వాయిదా పడిన లోక్ సభ..
మధ్య తరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు.. స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు పన్ను సున్నా
సెస్లు పడే 82 టారిఫ్ లైన్లపై సామాజిక సంక్షేమ సర్ఛార్జ్ ఎత్తివేత.. కోబాల్ట్ ఉత్పత్తులు, ఎల్ఈడీ, జింక్, లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు సహా 12 క్రిటికల్ మినరల్స్కు కస్టమ్స్ సుంకం తొలగిస్తున్నట్లు వెల్లడి..
సీనియర్ సిటిజన్స్కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.. అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగింపు-నిర్మలా సీతారామన్
120 కొత్త గమ్యాలకు ఇక విమాన సర్వీసులు.. 2025-26లో ఫిస్కల్ లోటు అంచనా 4.4 శాతం..
త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ కు వరాల జల్లు..
బడ్జెట్కి ముందు లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. 400 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్.. 135 పాయింట్లు డౌన్ అయినా నిఫ్టీ..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయం రూ.47.16లక్షల కోట్లు.. మూలధన వ్యయం రూ.10.1 లక్షల కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ అంచనా రూ.31.47 లక్షల కోట్లు.. నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25.57 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉంటుందని కేంద్రం అంచనా.
30 వేల రూపాయల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు..
త్వరలో పార్లమెంట్ ముందుకు జన విశ్వాస్ 2.0 బిల్లు.. వందకు పైగా నిబంధనలను నేరరహితమే లక్ష్యం..
ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై అదనపు శ్రద్ధ.. మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనలు సులభతరం చేయనున్నాం..
స్వయం సహాయక గ్రూపులకు గ్రామీన్ క్రెడిట్ కార్డులు.. 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పై పన్నులు తగ్గింపు..
వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు.. ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న అనవసర సెక్షన్లు తొలగింపు.. బీఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తున్నాం.. లిటిగేషన్లు తగ్గించేలా ఇన్కమ్ ట్యాక్స్ విధానం..
2025-26లోనే ఆస్పత్రుల్లో 200 క్యాన్సర్ సెంటర్స్.. ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం వర్కర్స్ (గిగ్)కు ఐడీ కార్డులు, హెల్త్ కవర్.. వారి కోసం ఈ-శ్రమ్ పోర్టల్..
ఐఐటీ, ఐఐఎస్సీ పరిశోధనలు చేసే 10 వేల మందికి ఫెలోషిప్స్.. ఆహార భద్రత కోసం జీన్ బ్యాంక్ ఏర్పాటు..
ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్ టెక్ మిషన్.. మరో 120 రూట్లలో ఉడాన్ పథకం.. పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.. ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్ డీఐలకు అనుమతి.. వచ్చే వారం పార్లమెంట్ ముందుకు కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు..
భారతీయ భాషా పుస్తక్ స్కీమ్, జ్ఞాన్ భారతం మిషన్.. విద్యలో ఏఐ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..
సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలు, విండ్ టర్బయిన్స్ కు ఊతం.. పెట్టుబడులు మా థర్డ్ ఇంజిన్..
విద్యుత్ రంగంలో సంస్కరణలకు పెద్దపీట.. విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్పోత్సాహకాలు.. సంస్కరణలు అమలు చేస్తే జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాలు.. క్లీన్ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్.. 2047 నాటికి 100 GWల అణు విద్యుత్ ఉత్పాదనే లక్ష్యం..
పర్వత ప్రాంతాల్లో హెలిప్యాడ్స్ ఏర్పాటుకు చర్యలు.. బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.. రూ. లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. నగరాలను గ్రోత్ హబ్స్ గా మార్చేందుకు నిధులు..
సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు.. 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు.. మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 1.5 లక్షల కోట్ల రుణాలు.. 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు..
దేశంలో కోటికి పైగా నమోదిత ఎంఎస్ఎంఈలు.. 45 శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈలవే.. ఎంఎస్ఎంఈల పెట్టుబడి, టర్నోవర్లు 2- 2.5 రెట్లు పెంపు.. ఫుట్ వేర్, లెదర్ రంగాల్లో కొత్తగా 22 లక్షల జాబ్స్ తెస్తాం..
చేపల ఉత్పత్తుల్లో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 2.. రైతులు, మత్య్సకారులు, డెయిరీ వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు.. అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్.. ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర..
ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు.. స్టార్టప్ లకు ఇచ్చే రుణాలు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంపు.. రూ. 30 వేలతో స్ట్రీట్ వెండర్స్ కు క్రిడిట్ కార్డులు.. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం..
అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త హంగులు.. అన్ని ప్రభుత్వ స్కూల్స్ కు బ్రాడ్ బ్యాండ్ సేవలు.. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు.. ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం.. విద్యా రంగంలో ఏఐ వినియోగం.. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్ సీట్లు.. బిహార్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ..
10 రంగాలపై ప్రత్యేక దృష్టి.. పేదలు, యూత్, అన్నదాతలు, మహిళలు, ప్రపంచ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా భారత్.. ఎగుమతులు పెంచుతాం.. ఇన్నోవేషన్స్ కు పెద్దపీట..
ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం.. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డు ఏర్పాటు..
లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్.. పోస్టల్ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళిక..
ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం..
ఎగుమతులు చేసే ఎంఎస్ఎంఈలకు రూ. 20 కోట్ల వరకు రుణాలు.. ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలు పెంపు.. ఎంఎస్ఎంఈ రంగంలో 7.8 కోట్ల మంది కార్మికులు..
కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.74 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.. కేసీసీ ద్వారా లోన్లు రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు.. బిహార్ లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు.. మఖనా ఉత్పత్రి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ..
2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం.. 2025-26కు అంచనా 6.3- 6.8 శాతం.. సబ్ కా వికాస్ కు వచ్చే ఐదేళ్లు సువర్ణవకాశం.. గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ను ప్రపంచ పరిణామాలు దెబ్బ తీస్తున్నాయి.. వికాస్ భారత్ లో జీరో పేదరికం, వంద శాతం క్వాలిటీ విద్య: ఆర్థిక మంత్రి నిర్మలా
పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.. ప్రయోగాత్మకంగా 100 జిల్లాలో పీఎం ధన్ ధాన్య యోజన..
ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్.. ఇన్ ఫ్రా, మధ్య తరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ప్రణాళిక..
బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు..
6 రంగాల్లో సమూల మార్పులు.. 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం..
అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.. సున్నా శాతం పేదరికమే లక్ష్యంగా బడ్జెట్
వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.. మేము చేపట్టిన సంస్కరణలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి..
విపక్షాల ఆందోళన మధ్యే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం..
బడ్జెట్ ప్రసంగంలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు సూక్తితో ప్రసంగం ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళన.. నిర్మలా సీతారామన్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న విపక్ష సభ్యులు..
లోక్ సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కాసేపట్లో లోక్ సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ్ పెట్టనున్నారు.
వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. కాసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్..
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు.. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో రైల్వే, విమాన ఛార్జీలు పెంపు.. ప్రజల ఆసక్తి మేరకు కేంద్ర బడ్జెట్ ఉండాలి- రాబర్ట్ వాద్రా
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10.20కి భేటీకానున్న కేంద్ర కేబినెట్.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం.. ఉదయం 11గంటలకి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక శాఖ, ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ..