Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్
- అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- కీలక విషయాలు రాబట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగాక అనేక కీలక విషయాలు రాబట్టింది. ఇక రెండోసారి రీ-పోస్ట్మార్టం జరిగాక అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలి పోస్ట్మార్టంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్ వచ్చినా.. తాజాగా రెండోసారి జరిపిన పోస్ట్మార్టంలో మాత్రం సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్విషా శర్మ దేహంపై ఉన్న గాయాలు.. ఆత్మహత్య తర్వాత జరిగినవి కావని.. ఆత్మహత్యకు ముందే ఆమెపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొంది. ఆత్మహత్యకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్ర పెనుగులాట జరిగిందని.. ఈ ఘర్షణలోనే ట్విషా శర్మకు గాయాలయ్యాయని నివేదికలో వెల్లడైంది.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన భర్త సమర్థ్సింగ్, అత్త గిరిబాలా సింగ్ అబద్ధాలు చెబుతుండడంతో సీబీఐ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం సీబీఐ బృందం గిరిబాలా సింగ్ నివాసానికి చేరుకుని విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గిరిబాలా సింగ్ను కస్టడీలో విచారించడం అవసరమని మధ్యప్రదేశ్ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా ట్విషా శర్మ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి గిరిబాలా సింగ్ ఏ మాత్రం వెనుకాడలేదని సీబీఐ ఆరోపించింది. ట్విషా శర్మను వరకట్న వేధింపులకు గురి చేశారని.. కీలక ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని.. బలవంతంగా గర్భస్రావం చేయించారని సీబీఐ ఆరోపించింది.
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
ట్విషా శర్మ మణికట్టు, మోచేతుల దగ్గర గాయాల గుర్తులు కనిపించాయని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. ఆ గాయాలు ఎలా వచ్చాయన్న దానిపై అత్తింటి వారు సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. మృతదేహాన్ని ఉరితాడు నుంచి దించేటప్పుడు ఆ గాయాలు ఏర్పడలేదని మెడికల్ రిపోర్ట్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. పోస్ట్మార్టం నివేదికలో నమోదైన గాయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక దర్యాప్తులో సేకరించిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్లు ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమె వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపింది. పుట్టబోయే బిడ్డ మరొకరికి చెందినదని ఆరోపిస్తూ ట్విషాపై ఒత్తిడి తెచ్చి గర్భస్రావం చేయించారని సీబీఐ పేర్కొంది.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!