Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్
- అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- కీలక విషయాలు రాబట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగాక అనేక కీలక విషయాలు రాబట్టింది. ఇక రెండోసారి రీ-పోస్ట్మార్టం జరిగాక అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలి పోస్ట్మార్టంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్ట్ వచ్చినా.. తాజాగా రెండోసారి జరిపిన పోస్ట్మార్టంలో మాత్రం సంచలన విషయాలు బయటపడ్డాయి. ట్విషా శర్మ దేహంపై ఉన్న గాయాలు.. ఆత్మహత్య తర్వాత జరిగినవి కావని.. ఆత్మహత్యకు ముందే ఆమెపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొంది. ఆత్మహత్యకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్ర పెనుగులాట జరిగిందని.. ఈ ఘర్షణలోనే ట్విషా శర్మకు గాయాలయ్యాయని నివేదికలో వెల్లడైంది.
అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన భర్త సమర్థ్సింగ్, అత్త గిరిబాలా సింగ్ అబద్ధాలు చెబుతుండడంతో సీబీఐ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం సీబీఐ బృందం గిరిబాలా సింగ్ నివాసానికి చేరుకుని విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గిరిబాలా సింగ్ను కస్టడీలో విచారించడం అవసరమని మధ్యప్రదేశ్ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా ట్విషా శర్మ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి గిరిబాలా సింగ్ ఏ మాత్రం వెనుకాడలేదని సీబీఐ ఆరోపించింది. ట్విషా శర్మను వరకట్న వేధింపులకు గురి చేశారని.. కీలక ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని.. బలవంతంగా గర్భస్రావం చేయించారని సీబీఐ ఆరోపించింది.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ట్విషా శర్మ మణికట్టు, మోచేతుల దగ్గర గాయాల గుర్తులు కనిపించాయని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. ఆ గాయాలు ఎలా వచ్చాయన్న దానిపై అత్తింటి వారు సరైన వివరణ ఇవ్వలేదని తెలిపింది. మృతదేహాన్ని ఉరితాడు నుంచి దించేటప్పుడు ఆ గాయాలు ఏర్పడలేదని మెడికల్ రిపోర్ట్ స్పష్టం చేసినట్లు పేర్కొంది. పోస్ట్మార్టం నివేదికలో నమోదైన గాయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక దర్యాప్తులో సేకరించిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా అత్త గిరిబాలా సింగ్, భర్త సమర్థ్ సింగ్లు ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమె వ్యక్తిత్వంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపింది. పుట్టబోయే బిడ్డ మరొకరికి చెందినదని ఆరోపిస్తూ ట్విషాపై ఒత్తిడి తెచ్చి గర్భస్రావం చేయించారని సీబీఐ పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!