Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో శాసనసభ స్పీకర్కు వ్యతిరేకంగా జరగబోయే ఓటింగ్లో అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల భారీ లంచం ఆఫర్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే (TVK) ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాను కొందరు వ్యక్తులు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ ఎర వేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
Also Read
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
అయితే, కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ఇళయరాజాకు తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్’ (IPDS) అనే సర్వే సంస్థను నడుపుతున్నానని, ఒక ముఖ్యమైన పార్టీకి చెందిన కొందరు నేతల తరఫున మాట్లాడుతున్నానని చెప్పాడు. అసెంబ్లీలో స్పీకర్కు వ్యతిరేకంగా తీర్మానం రానుందని, ఆ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేస్తే రూ.35 కోట్లు ఇస్తామని ఆశ చూపాడు. దీనికి ఎమ్మెల్యే నిరాకరించడమే కాకుండా, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తిరునావుక్కరసు.. ఈ విషయం బయటపెడితే ఎమ్మెల్యేను, ఆయన కుటుంబాన్ని మట్టుబెడతామని బెదిరించాడు. ఈ బెదిరింపులపై ఎమ్మెల్యే ఇళయరాజా జూన్ 29, 2026న చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. దీని ఆధారంగా డీ1 త్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాల సాయంతో చెన్నై అరుంబాక్కానికి చెందిన తిరునావుక్కరసు, తిరుచ్చికి చెందిన నరేష్, మేడవాక్కానికి చెందిన త్యాగరాజన్లను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. డీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ సోదరుడు వి. అశోక్ కుమార్.. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు నరేష్ను చెన్నైలో కలిసినట్లు పోలీసులు గుర్తించారు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకే తిరునావుక్కరసు రంగంలోకి దిగి ఎమ్మెల్యే ఇళయరాజాకు ఫోన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!