Site icon NTV Telugu

Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో ఢిల్లీ సీబీఐ ముందుకు విజయ్

Vijay

Vijay

టీవీకే అధినేత, నటుడు విజయ్ ఢిల్లీలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తమ ఎదుట హాజరుకావాలని ఇటీవల సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Stock Market: ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. లాభాల్లో సూచీలు

గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని రాజకీయంగా కుదిపేసింది. పెద్ద ఎత్తున నాయకులు విమర్శలు గుప్పించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో విజయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, ఛాన్సలర్ మెర్జ్

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రచారాలు కూడా ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే విజయ్ కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక విజయ్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా? లేదంటే సింగల్‌గా వెళ్తారా? అన్న తేలాల్సి ఉంది.

Exit mobile version