Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే గవర్నర్కు నకిలీ మద్దతు లేఖ సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో విజయ్ గవర్నర్ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇదే సమయంలో, తమ పార్టీ ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ మద్దతు లేఖను టీవీకే ఫోర్జరీ చేసి గవర్నర్కు సమర్పించిందని దినకరన్ ఆరోపించారు. తాము గవర్నర్కు అందజేసిన అసలు లేఖ వేరేనని, టీవీకే సమర్పించినది ఫేక్ కాపీ అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై క్రిమినల్ ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. దీంతో దినకరన్ చెన్నైలోని గిండి పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు. టీవీకేపై మోసం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని, ఇతర పార్టీల మద్దతు కూడగట్టి గవర్నర్ను కలుస్తామని దినకరన్ వెల్లడించారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
అయితే, ఈ ఆరోపణలను టీవీకే తీవ్రంగా ఖండించింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ స్వయంగా విజయ్కు మద్దతు తెలుపుతున్న వీడియోను టీవీకే విడుదల చేసింది. ఆ వీడియోలో కామరాజ్ మాట్లాడుతూ, విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం దినకరన్ సమ్మతితోనే తీసుకున్నామని తెలిపారు. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని టీవీకే స్పష్టం చేసింది. ఇక మరోవైపు, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విజయ్ తనవైపు తిప్పుకుంటున్నారని దినకరన్ ఆరోపించారు. తన పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదని గవర్నర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే అర్ధరాత్రి తర్వాత కామరాజ్ను వెంట తీసుకుని మళ్లీ లోక్భవన్కు వెళ్లిన దినకరన్, గవర్నర్కు తాము సమర్పించిన లేఖ మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రాకముందే నకిలీ మద్దతు లేఖల వివాదం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!