NTV Telugu Site icon

Speaker election: కాంగ్రెస్ స్పీకర్ అభ్యర్థికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు..

Speaker Election

Speaker Election

Speaker election: లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ ఓం బిర్లా పోటీలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్‌ని స్పీకర్ పోస్టుకు ప్రతిపాదించింది. దాదాపుగా 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా స్పీకర్‌ని ఎన్నుకుంటాయి. అయితే, ఈసారి డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు కావాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో తాము కూడా స్పీకర్ పదవికి పోటీ చేస్తామని ఇండియా కూటమి తరుపున అభ్యర్థిని నిలబెట్టారు.

ఇదిలా ఉంటే, తమకు చెప్పకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ రోజు టీఎంసీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..

బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.