Site icon NTV Telugu

భారత్ లో 60 వేలకు దిగువగా కరోనా కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు త‌గ్గిపోయింది. తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 58,419 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,98,81,965కి చేరింది. ఇందులో 2,87,66,009 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,29,243 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1,576 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,86,713కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 87,619 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Exit mobile version