Site icon NTV Telugu

భారత్ లో స్థిరంగా కరోనా కేసులు…

corona

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 44,111 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. ఇందులో 2,96,05,779 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,95,533 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 738 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,01,050 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 57,477 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Exit mobile version