తిరుగుబాటు లోక్సభ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఫిరాయింపు నిరోధక నిబంధనల కింద ఆయా ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం.. రానున్న 7 నుంచి 10 రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. తిరుగుబాటు ఎంపీలు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ ఈ న్యాయపోరాటాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధనల ప్రకారం తమ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ కోరుతోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. ఎంపీల లోక్సభ సభ్యత్వానికి సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరే అవకాశం ఉంది. తిరుగుబాటు ఎంపీలపై న్యాయపరమైన చర్యలను టీఎంసీ మరింత ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఎంపీల పేర్లు, వారిపై టీఎంసీ ప్రస్తావించనున్న నిర్దిష్ట కారణాలు, పిటిషన్లో పేర్కొనే ఇతర అంశాలపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

