West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
- టీఎంసీపై తిరగబడుతున్న బెంగాల్ ప్రజలు..
- ‘‘కట్మనీ’’ వ్యవహారంపై ప్రజల ఆగ్రహం..
- దోచుకున్న డబ్బు తిరిగిస్తామంటున్న టీఎంసీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal:పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 15 ఏళ్లుగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు, నేతలు ప్రజలపై అనేక దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఘోర పరాజయం తర్వాత, బీజేపీకి అధికారంలోకి రావడంతో ప్రజలు టీఎంసీపై తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో తమను పీడించిన తృణమూల్ నేతలు, కార్యకర్తల బట్టలూడదీసి కొడుతున్నారు. ముఖ్యంగా ‘‘కట్మనీ’’ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కట్మనీ వ్యవహారంపై సీఎం సువేందు అధికారి కూడా ప్రత్యేక దృష్టి సారించి, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆగ్రహం కారణంగానే తృణమూల్ నేతలు భయపడుతున్నారు. ఇప్పుడు గతంలో తాము కట్ మనీ పేరుతో దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామని టీఎంసీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నారు. కూచ్ బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఘుఘుమారి పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యులు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద అక్రమంగా వసూలు చేసిన మొత్తం ‘కట్ మనీ’ లేదా కమీషన్ను జూన్ 4వ తేదీలోగా తిరిగి చెల్లిస్తానని ఆటో రిక్షాలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ పెట్టి మరీ చెబుతున్నారు.
Also Read
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
గ్రామస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్న సమయంలో పరిస్థితి బాగా లేదని టీఎంసీ నేతలు దోచుకున్న డబ్బును ఇచ్చేందుకు లిఖిత పూర్వక హామీలు ఇస్తున్నారు. ఘుఘుమారి గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 173కు చెందిన స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యురాలు జ్యోత్స్న బర్మన్ ఇంటి బయట పెద్ద సంఖ్యలో స్థానికులు నిరసన తెలిపారు. గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను కల్పించినందుకు టీఎంసీ నేతలు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
తాజావార్తలు
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!