West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్మనీ”పై టీఎంసీలో భయం..
- టీఎంసీపై తిరగబడుతున్న బెంగాల్ ప్రజలు..
- ‘‘కట్మనీ’’ వ్యవహారంపై ప్రజల ఆగ్రహం..
- దోచుకున్న డబ్బు తిరిగిస్తామంటున్న టీఎంసీ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal:పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 15 ఏళ్లుగా చాలా మంది తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు, నేతలు ప్రజలపై అనేక దోపిడీలకు పాల్పడ్డారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఘోర పరాజయం తర్వాత, బీజేపీకి అధికారంలోకి రావడంతో ప్రజలు టీఎంసీపై తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో తమను పీడించిన తృణమూల్ నేతలు, కార్యకర్తల బట్టలూడదీసి కొడుతున్నారు. ముఖ్యంగా ‘‘కట్మనీ’’ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కట్మనీ వ్యవహారంపై సీఎం సువేందు అధికారి కూడా ప్రత్యేక దృష్టి సారించి, విచారణకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ఆగ్రహం కారణంగానే తృణమూల్ నేతలు భయపడుతున్నారు. ఇప్పుడు గతంలో తాము కట్ మనీ పేరుతో దోచుకున్న డబ్బును తిరిగి ఇస్తామని టీఎంసీ వాళ్లు బహిరంగంగా చెబుతున్నారు. కూచ్ బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఘుఘుమారి పంచాయతీకి చెందిన టీఎంసీ సభ్యులు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద అక్రమంగా వసూలు చేసిన మొత్తం ‘కట్ మనీ’ లేదా కమీషన్ను జూన్ 4వ తేదీలోగా తిరిగి చెల్లిస్తానని ఆటో రిక్షాలో తిరుగుతూ లౌడ్ స్పీకర్ పెట్టి మరీ చెబుతున్నారు.
Also Read
- Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)
- West Bengal R*ape Case: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ప్రధాన నిందితుడు పోలీసు ఎన్కౌంటర్లో మృతి
- Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
- Beware Bachelors: పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన వార్త! అందాల ఎర వేసి కోట్లు కాజేసిన కేటుగాళ్లు..
గ్రామస్తులు తీవ్ర నిరసన తెలుపుతున్న సమయంలో పరిస్థితి బాగా లేదని టీఎంసీ నేతలు దోచుకున్న డబ్బును ఇచ్చేందుకు లిఖిత పూర్వక హామీలు ఇస్తున్నారు. ఘుఘుమారి గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 173కు చెందిన స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యురాలు జ్యోత్స్న బర్మన్ ఇంటి బయట పెద్ద సంఖ్యలో స్థానికులు నిరసన తెలిపారు. గృహ నిర్మాణ పథకం ప్రయోజనాలను కల్పించినందుకు టీఎంసీ నేతలు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేశారని గ్రామస్తులు ఆరోపించారు.
తాజావార్తలు
-
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
-
Gautam Gambhir: ‘వీ వాంట్ సంజూ’.. కోచ్ కీలక వ్యాఖ్యలు.!
-
Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Alcohol Effects: మద్యం కాలేయానికే కాదు.. మెదడుకూ ముప్పే..! వైద్యుల హెచ్చరిక
-
Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!