Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- బెంగాల్ ఓటమి తర్వాత టీఎంసీలో కల్లోలం.
- అస్సాం టీఎంసీ చీఫ్ అభిజిత్ మజుందార్ రాజీనామా.
- “ముస్లింల కోసమే పార్టీ పని చేస్తోంది” అంటూ ఆరోపణలు.
- వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి కన్నా ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే మమతా బెనర్జీని ఇంకా ఎక్కువ భయపెడుతున్నాయి. మరికొంత కాలం తర్వాత టీఎంసీ ఉంటుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అరాచకాలపై సీఎం సువేందు అధికారి విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు, పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం దీదీని కలవరపెడుతోంది.
తాజాగా అస్సాం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అభిజిత్ మజుందార్ శుక్రవారం పార్టీకి రాజీనమా చేశారు. మజుందార్ తన లేఖను మమతా బెనర్జీకి ఈమెయిల్ చేశారు. తన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో పార్టీ ప్రతిష్ట క్రమంగా ‘‘కేవలం ముస్లింల కోసమే పనిచేసే సంస్థ’’గా మారిందని ఆరోపించారు. ఇదే వైఖరి బెంగాల్లో కూడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను టీఎంసీలో కొనసాగలేదనని, పార్టీ పనితీరు, రాజకీయ దిశ కారణంగా సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఆయన అన్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఇప్పటికే బెంగాల్ టీఎంసీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వందలాది మంది పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి సంబంధిత వివాదాలపై పార్టీని సమర్థించలేకపోతున్నానని అన్నారు. ఇక టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ మరో రెండేళ్ల వరకు టీఎంసీ నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!