డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో రోడ్డు ప్రమాదాలకు ఆజ్యం పోసినట్లవుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం తమిళనాడులో చోటుచేసుకుంది.
#WATCH | Tamil Nadu | Visuals from the KG Kandigai area where 5 people lost their lives in a Tipper Lorry, and Bus collision near Thiruttani. As per Tiruttani Police, 10 others are in critical condition and admitted to Thiruttani General Hospital pic.twitter.com/cfLFlDwItJ
— ANI (@ANI) March 7, 2025