Climate Change: మానవ మనుగడకే సవాల్ … ఉపఖండంలో వేగంగా వాతావరణ మార్పులు
Climate Change: భారత ఉపఖండంలో వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో మానవ వనుగడకు ముప్పుగా వాటిల్లనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES)అంచనా వేసింది. శతాబ్ది చివరి నాటికి వేడి తరంగాల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశం ఉందనీ, భారతదేశంలో వాతావరణ మార్పుల వేగంగా సంభవిస్తున్నాయని తెలిపింది. భూతాపం, వాతావరణ మార్పులు కలవరపెడుతున్నాయి. వేసవికాలంలో భరించలేని వడగాల్పులు.. ఆ వెంటనే వర్షకాలంలో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు.. ఏకంగా మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. భారత ఉపఖండంలో చోటుచేసుకుంటున్నా.. ఈ వాతావరణ మార్పులు యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్న మనిషి ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం నింపడంలో పర్యవరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) నివేదిక హెచ్చరిస్తోంది.
Read also: Adah Sharma: అదా శర్మకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు!
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ (MoES) 2020లో ‘భారతదేశంలో వాతావరణ మార్పుల అంచనా అనే నివేదికను ప్రచురించింది. ఇందులో భారత ఉపఖండంపై వాతావరణ మార్పులను సమగ్ర అంచనా వేసింది. 1901-2018 సమయంలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత దాదాపు 0.7 డిగ్రీలు పెరిగిందని పేర్కొంది. అలాగే.. 1950-2015లో రోజువారీ వర్షపాతం తీవ్రత (వర్షపాతం తీవ్రత > 150 మిమీ) 75 శాతం పెరిగిందని తెలిపింది. అదే సమయంలో భారతదేశంలో కరువుల పరిస్థితులు పెరిగాయని నివేదించింది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టం కూడా పెరిగిందనీ, గత రెండున్నర దశాబ్దాలలో (1993-2017) 3.3 మి.మీ. పెరిగినట్టు సూచించింది. ఇదిలా ఉంటే.. 1998-2018 మధ్యకాలంలో అరేబియా సముద్రంలో తరుచు తుఫానులు సంభవిస్తున్నాయని హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ (IMD) భారతదేశ వాతావరణాన్ని మామూలుగా పర్యవేక్షిస్తుంది. “వార్షిక వాతావరణ సారాంశం” అనే పేరిట వార్షిక ప్రచురణను విడుదల చేస్తుంది. అలాగే.. IMD నెలవారీ వాతావరణ నివేదికలను కూడా జారీ చేస్తుంది. వార్షిక వాతావరణ సారాంశం సంబంధిత కాలంలో సంభవించే ఉష్ణోగ్రత, వర్షపాతం, తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించి సమాచారాన్ని అందిస్తోంది. వాతావరణ మార్పులపై పలునేతలు అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!