Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?
- వయనాడ్ సందర్శించినందుకు ప్రధానికి రాహుల్ గాంధీ థాంక్స్..
- జాతీయ విపత్తుగా ప్రకటిస్తారనే నమ్మకం ఉందని వెల్లడి..
- ఈ రోజు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన మోడీ..
Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ పర్యటనకు వెళ్లారు. ఈ ఘటనలో బాధిత ప్రజలను నేరుగా కలిశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. స్థానిక ఆస్పత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించారు. పర్యటనలో ఎంత మంతి పిల్లలు తమ వారిని పోగొట్టుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపీలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో పునరావాసం మరియు సహాయక చర్యల కోసం ₹ 2,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.
Read Also: S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ని సందర్శించడాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ‘‘ఈ భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంల తెలుసుకునేందుకు వయనాడ్ని సందర్శించినందుకు మోడీజీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. విధ్వంసాన్ని ప్రధాని ప్రత్యక్షంగా చూసిన తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రమాద ప్రాంతాన్ని రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. జూలై 30న, వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 416 మంది మరణించారు ,150 మందికి పైగా తప్పిపోయారు.
Thank you, Modi ji, for visiting Wayanad to personally take stock of the terrible tragedy. This is a good decision.
I am confident that once the Prime Minister sees the extent of the devastation firsthand, he will declare it a national disaster.
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2024
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!