Rahul Gandhi: ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ..ఎందుకంటే..?
- వయనాడ్ సందర్శించినందుకు ప్రధానికి రాహుల్ గాంధీ థాంక్స్..
- జాతీయ విపత్తుగా ప్రకటిస్తారనే నమ్మకం ఉందని వెల్లడి..
- ఈ రోజు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కొండచరియలు విరిగిపడటం వల్ల కేరళలోని వయనాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఈ విషాద ఘటనలో 400 మంది కన్నా ఎక్కువ ప్రజలు మరణించారు. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ పర్యటనకు వెళ్లారు. ఈ ఘటనలో బాధిత ప్రజలను నేరుగా కలిశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. స్థానిక ఆస్పత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాన్ని సందర్శించారు. పర్యటనలో ఎంత మంతి పిల్లలు తమ వారిని పోగొట్టుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్ర మంత్రి సురేష్ గోపీలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతంలో పునరావాసం మరియు సహాయక చర్యల కోసం ₹ 2,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది.
Read Also: S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ వయనాడ్ని సందర్శించడాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ‘‘ఈ భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంల తెలుసుకునేందుకు వయనాడ్ని సందర్శించినందుకు మోడీజీకి ధన్యవాదాలు. ఇది మంచి నిర్ణయం. విధ్వంసాన్ని ప్రధాని ప్రత్యక్షంగా చూసిన తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని నాకు నమ్మకం ఉంది’’ అంటూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. అంతకుముందు ప్రమాద ప్రాంతాన్ని రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. జూలై 30న, వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 416 మంది మరణించారు ,150 మందికి పైగా తప్పిపోయారు.
Thank you, Modi ji, for visiting Wayanad to personally take stock of the terrible tragedy. This is a good decision.
I am confident that once the Prime Minister sees the extent of the devastation firsthand, he will declare it a national disaster.
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!