TCS Nashik Case: ఐటీ ఇండస్ట్రీలో సంచలనంగా టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు.. మహిళా భద్రతపై డౌట్స్..
- ఐటీ ఇండస్ట్రీలో సంచలనంగా టీసీఎస్ నాసిక్ కేసు..
- కార్పొరేట్ జిహాద్ ఆరోపణలతో కలకలం..
- ఏడుగురు నిందితుల అరెస్ట్, పరారీలో హెచ్ఆర్..
- పని ప్రదేశాల్లో మహిళా భద్రతపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. వర్క్ ప్లేసుల్లో మత వ్యవహారాలను తీసుకురావడం, బలవంతంగా ఒక కుట్ర ప్రకారం మతమార్పిడిలు చేపట్టడం, మహిళలపై లైంగిక వేధింపులు వంటివి వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రతకు కార్పొరేట్ పాలసీలు ఉన్నప్పటికీ, సీనియర్ ఉద్యోగులు, హెచ్ఆర్ సిబ్బంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ఏమిటి కేసు:
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఈ కేసులో మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడటం, మతపరమైన ఒత్తిడి వంతి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరికి సహకరించిన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ పరారీలో ఉండగా ఆమెను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన నిందితులు టీమ్ లీడ్ వంటి పోస్టుల్లో ఉంటూ కింది ఉద్యోగులను ముఖ్యంగా హిందూ యువతుల్ని టార్గెట్ చేశారు.
హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, వారిని మతపరంగా అవమానించడం, తమ మతాన్ని అనుసరిస్తేనే సాలరీ హైక్స్, ఉద్యోగ భద్రత ఉంటుందని భయపెట్టడం వంటి వారికి నిందితులు పాల్పడ్డారు. నిదా ఖాన్ హిందూ మహిళలతో స్నేహం చేసి, వారిని క్రమంగా నమాజ్ చేయించడం, హిజాబ్ ధరించడం వంటిని నేర్పించేదని, ఎవరైనా ఈ వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
కేసు ఎలా బయటకు వచ్చింది.?
2026 ఫిబ్రవరిలో నాసిక్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ సాగింది. కంపెనీలో పనిచేసే యువతి కొన్ని రోజులకే తన మతాన్ని మార్చుకున్నట్లు కుటుంబీకులు గమనించారు. దీంతో మహిళా పోలీసులు కొన్ని రోజుల పాటు ఉద్యోగులుగా ఆ కంపెనీలో చేరి, అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఆరోపణలు నిజమని తేల్చారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మొత్తం 9 మంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు కూడా ఉన్నాడు.
నిందితులపై లైంగిక వేధింపులు, అత్యాచారం, మతపరమైన ఒత్తిడి వంటి కేసులు పెట్టారు. ఏసీసీ సందీప్ మిట్కే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులకు సంబంధించిన ఈమెయిల్స్, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, చాట్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందించారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కంపెనీ విచారణకు పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు.
మహిళలకు భద్రత లేదా..?
మెరిసే అద్దాల మేడలు, ఆకర్షణీయమైన ఐటీ ఇండస్ట్రీ వెనక ఇలాంటి అరాచకాలు జరుగుతుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అత్యున్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసే ఇలాంటి వర్క్ప్లేస్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. వారి బలహీనత, ఉద్యోగ అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ‘‘కార్పొరేట్ జిహాద్’’కు పాల్పడుతున్నారు. అయితే, మహిళల భద్రత కోసం ‘‘సెక్చువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013’’ (POSH చట్టం) చట్టం ప్రకారం, పని ప్రదేశాల్లో ఇంటర్నల్ కమిటీ ఉండాలి, ఉద్యోగలుకు భద్రమైన వాతావరణ కల్పించాలి. ఫిర్యాదుల్ని తీసుకోవాలి.
కానీ నాసిక్ కేసులో ఇవేవీ పనిచేయలేదు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసినా పట్టించుకోలేదు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. కార్పొరేట్ వరల్డ్లో ఇదంతా కామన్ అంటూ హెచ్ ఆర్ విభాగం చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. ఇది ఒక్క నాసిక్ సంఘటన మాత్రమే కాదు. చాలా కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉన్న వారు మహిళా ఉద్యోగుల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు. ఇలాంటి వారిపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ, వేధింపులు జరగగానే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచింది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..