Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.
విద్యార్థులు, యువత సీజేపీ, వామపక్ష నిరసనల్లో, ఆందోళనల్లో పాల్గొనాలనే ఉత్సాహానికి లోనుకాకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పాఠశాల, కళాశాలల్ని ఆదేశించింది. ఈ నిర్ణయంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ జాతీయ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ప్రభుత్వ ఆదేవఆలు రాజ్యాంగ విరుద్ధమని, అర్థరహితమని, అసమంజసమైనవని విమర్శించారు.
అయితే, బీజేపీ విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, వామపక్ష సంస్థలను బీజేపీ నేత వినోద్ పీ సెల్వం ‘‘అరాచకానికి ఏజెంట్లు’’గా అభివర్ణించింది. నీట్ పేపర్ లీక్ వ్యహరానికి వ్యతిరేకంగా సీజేపీ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనల తర్వాత దేశవ్యాప్తంగా యువత నిరసనలు పెరుగుతున్నాయి. పరీక్షలు, విద్యా మౌలిక సదుపాయాలపై జెన్-జీ, జెన్-ఆల్ఫా ఆందోళనలు పెరిగాయి.

